
పయనించే సూర్యుడు మే 30. ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
మూడు వేర్వేరు కేసుల్లో 14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టివేత..
తొమ్మిది మంది అరెస్ట్.. రిమాండ్ కు తరలింపు… కొనసాగుతున్న విచారణ
నకిలీ విత్తనాల కట్టడికి టాస్క్ ఫోర్స్ బృందాలు
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్
కుటీర పరిశ్రమలాగా నకిలీ ప్రత్తి విత్తనములు తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడి మూడు వేర్వేరు కేసుల్లో 14 లక్షల విలువ చేసే 560 కేజీల నకిలీ విత్తనాలు పట్టుకున్నారని, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా పకడ్బంది చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎవరైనా ప్రముఖ బ్రాండెడ్ కంపెనీల విత్తనాల పేరుతో నాసి రకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతులను మోసం చేయాలని చూస్తే ఉపేక్షించేది లేదని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. ముఖ్యంగా .రైతులు సైతం విత్తనాలు కొనుగోలు సమయంలో అప్రమత్తత పాటించాలని, తక్కువ ధరలకు తెలియని వ్యక్తుల నుండి కొనుగోలు చేసి మోసపోవద్దని అన్నారు. కొంతమంది దళారులు ముఠాలుగా ఏర్పడి, తక్కువ డబ్బుకు విత్తనాలు ఇస్తామని ఆశ చూపి రైతులను మోసం చేస్తారని, ఇటువంటి వారిపై గ్రామాల్లో సైతం నిఘా పెట్టామని తెలిపారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే వెంటనే మండల వ్యవసాయ శాఖ అధికారికి గాని స్ధానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. మార్కెట్ లో నకిలీ విత్తనాల విక్రయం జరుగకుండా టాస్క్ ఫోర్స్ బృందాల నిరంతరం పర్యవేక్షణ వుంటుందని తెలిపారు. కేసు వివరాలు…తేదీ 28.05.2025 న ఉదయం ఏన్కూర్ పోలీస్ మరియు వ్యవసాయ అధికారుల ఉమ్మడి తనిఖీలలో భాగంగా ఏనుకూరు గ్రామానికి చెందిన గాజుల నరసింహారావు వయసు 49 సంవత్సరాలు అనే వ్యక్తి కొద్దిమంది రైతులకు అనుమతిలేని పత్తి విత్తనాలను అమ్ముతున్నాడని సమాచారం మేరకు తనిఖీ నిర్వహించగా అతని వద్ద 450 గ్రాములు బరువు గల అడ్వాన్స్ 555 పేర్లతో ఉమ్మడి పత్తి విత్తనాల ప్యాకెట్లు దొరకగా సీజ్ చేయడం జరిగింది. ఎస్సై కల్లూరు గారిని శ్రీమతి డి హరిత కల్లూరు గారితో ఒక టీం ఏర్పాటు చేసి తదుపరి విచారణ చేయగా ఇట్టి పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మైలవరం మండలానికి చెందిన చంద్రు గూడెం గ్రామానికి చెందిన శాలివాహన అనే వ్యక్తి వద్ద నుండి కిలో 450 గ్రాముల ప్యాకెట్లను 400 రూపాయలకు కొనుక్కొచ్చి ఇక్కడ 1,200 రూపాయలకు అమ్ముతున్నాడని విచారణలో వెలుగులోనికి వచ్చింది. ఇట్టి విషయం పైన గౌరవ సిపి ఖమ్మం గారి ఆదేశం ప్రకారం శ్రీమతి డి హరిత ఎస్సై కల్లూరు గారి ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసి మైలవరం మండలం చంద్రు గూడెం గ్రామానికి చెందిన శాలివాహన సన్నాఫ్ ఎల్లయ్య ఆర్.ఓ చంద్రు గూడెం ఇంటి వద్ద ఒక కుటీర పరిశ్రమలాగా నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. అతను కర్ణాటక నుండి ప్రతి విత్తనాలు మరియు వాటిని ట్యాగ్ చేయడానికి ప్రింటెడ్ అడ్వాన్స్ త్రిబుల్ ఫై నెంబర్ గల కవర్తో ఉన్న ప్యాకెట్స్ తో తీసుకొచ్చి తన ఇట్టిపతి విత్తనాలను రైజోబెల్ మిశ్రమాన్ని కలిపి ఆరబెట్టి ఇట్టిపత్తి విత్తనాలను ప్యాకెట్లలో నింపి సీల్ చేసి గాజుల నరసింహారావు మరి కొంతమంది ఏజెంట్లు ద్వారా రైతులకు అధిక దిగుబడి వస్తుందని అలాగే కలుపమందు వలన ఇబ్బంది ఉండదని నమ్మించి ఒక్కొక్క ప్యాకెట్ 1,200 రూపాయలకు రైతులకు అమ్ముతున్నాడని తెలిసింది. అతని ఇంటి వద్ద నుండి ఒక క్వింటా రైజోబెల్ మిశ్రమం కలిపి పెట్టి ప్యాక్ చేయన్ని పత్తి విత్తనాలు, 450గ్రాములు బరువు కలిగి అరుణోదయ లేబల్ తో ఉన్న (272) పత్తి విత్తన ప్యాకెట్లను అలాగే ప్యాకెట్ సీల్ చేయడానికి వాడే (2) మిషన్లు, ఒక వేయింగ్ మిషన్, ప్రత్తి విత్తనములు పక్క చేయుటకు అరుణోదయ లేబల్ తో ఉన్న సుమారు (400) ఖాళీ పాక్కెట్లు మరియు రెండు లీటర్ల రైజోబెన్ మిశ్రమమును సీజ్ చేయడం జరిగింది. మరో కేసులో తేదీ 27.05.2025 రోజు ఉదయం ఏన్కూరు పోలీస్ మరియు మండల వ్యవసాయ అధికారులు సంయుక్తంగా రేపల్లెవాడ గ్రామ శివారున నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం మేరకు వెనిగండ్ల శ్రీహర్రావు అనే వ్యక్తి యొక్క వ్యవసాయ భూమిలో తనిఖీలు నిర్వహించగా అక్కడ (210) ఒక కేజీ ప్యాకెట్లలో ఉన్న నకిలీ పత్తి విత్తనాలను గుర్తించి స్వాధీనం చేసుకోవడం జరిగినది. తదుపరి వెనిగండ్ల శ్రీధర్ రావు ఇచ్చిన సమాచారం మేరకు అతని అనుచరుడైన ఇమ్మినేని కిషోర్ ఏన్కూరు ఇంటి వద్ద తనిఖీ చేయగా సుమారు 120 కిలోల పత్తి విత్తనాలు లభించినాయి. అలాగే పత్తి విత్తనాలు తయారు చేయడానికి ఉపయోగిస్తున్న రైజోబిన్ కెమికల్ మరియు వేయింగ్ మిషన్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వెనిగండ్ల శ్రీహర్రావు గత కొంతకాలంగా బాపట్ల జిల్లాలో ఉన్న తన బంధువైన లక్ష్మీనారాయణ ద్వారా కిలో 800/- రూపాయాలకి నకిలీ మరియు ఎటువంటి అనుమతి లేని విత్తనాలు తెప్పిస్తూ ఏన్కూరు మండల రైతులకు అధిక దిగుబడి వస్తున్న వంగడాలని నమ్మించి కిలో రూ 2,600/- రూపాయలకు అమ్ముచు లాభాలు గడిస్తున్నాడని విచారణలో తెలిసినది. అదేవిధంగా ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో ఎస్సై ఏన్కూరు గారికి వచ్చిన సమాచారం మేరకు ఏన్కూరు గ్రామంలో పోలేటి కోటేశ్వరరావు గారి ఇంటి వద్ద తనిఖీ చేయగా అతని వద్ద నకిలీ ప్రతి విత్తనాల ప్యాకెట్ (20) ప్యాకెట్లు లభ్యమైనది. అతనిని విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలి జిల్లా నుండి తీసుకొచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రత్తి విత్తనాలను అమ్ముతున్నాడని తెలిసింది. నిందుతులు గ్యాంగ్ 1 ఎ 1:- వెనిగండ్ల శ్రీహరి రావు తండ్రి: సంజీవరావు, 60 సం, కమ్మ, వ్యాపారం హిమం నగర్ . ఎ 3: అన్నెం లక్ష్మీనారాయణ 60 సం, భీమవరం గ్రామం, ఇంకొల్లు మండలం ఎ 4:-గూగులోతు గోపి 40 సం, హిమం నగర్ A-5:- వరదబోయిన రమేష్, 40 సంవత్సరాలు, రేపల్లెవాడ
ఎ 6: తాంబళ్ళ నవీన్ రేపల్లెవాడ ఎ 7: దొంతబోయిన రమేష్ రేపల్లెవాడ ఎ 1: గాజుల నరసింహారావు 49 సం ఏనుకూరు ఎ 2:చర్లపల్లి శాలివాహన 45 సం, చంద్ర గూడెం, మైలవరం మండలం గ్యాంగ్ 3 1) పోలేటి కోటేశ్వరరావు 36 సం,ఏనుకూరు గ్రామము 2) వెనిగండ్ల రవి, 45 సం, R/o ఇంకొల్లు మండలం, బాపట్ల జిల్లా. గ్యాంగ్-3 నుండి స్వాధీనం చేసుకున్న పదార్థాలు (20) (450 గ్రాములు) పల్లవి పత్తి విత్తనాల ప్యాకెట్లు గ్యాంగ్-2 నుండి స్వాధీనం చేసుకున్న పదార్థాలు 1) (1) వదులుగా ఉన్న పత్తి విత్తనాల క్వింటల్ 2) అరుణోదయ & అడ్వాన్స్ 555 తో కూడిన 270 (450 గ్రాములు) పత్తి విత్తన లేబుల్ ప్యాకెట్లు.3) 1 లీటరు రిజోబిన్ రసాయనం 4) (2) తూకం యంత్రాలు 5) (2) ఎలక్ట్రిక్ సీలింగ్ యంత్రాలు 6) (400) అరుణోదయ & అడ్వాన్స్ 555 తో కూడిన ఖాళీ ప్యాకెట్ల లేబుల్ గ్యాంగ్-1 నుండి స్వాధీనం చేసుకున్న పదార్థాలు 1) (330) 1 కిలోల పత్తి విత్తనాల ప్యాకెట్లు 2) 2 లీటర్ల రిజోబిన్ రసాయనం 3) తూకం యంత్రం స్వాధీనం సుకున్నారు
మీడియా సమావేశం లో కల్లూరు ఏసీపీ రఘు, సత్తుపల్లి రూరల్ సిఐ ముత్తులింగం, ఎస్సై రఫి, ఎస్సై హరిత పాల్గొన్నారు.

