Tuesday, June 10, 2025
Homeఆంధ్రప్రదేశ్నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం కల్పించాలి.

నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం కల్పించాలి.

Listen to this article

డీజీపీకి ఫిర్యాదు చేసిన బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర బృందం.

పయనించే సూర్యుడు: మే 26: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.

వాజేడు:ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల్లో నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయిన గిరిజన రైతులకు న్యాయం కల్పించాలంటూ, బీజేపీ ఎస్టీ మోర్చారాష్ట్ర బృందం ఈరోజు తెలంగాణ రాష్ట్ర డీజీపీని కలిసి అధికారికంగా ఫిర్యాదు చేసారు. ఈ సందర్భంగా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు డా. కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ, “గత కొద్ది నెలలుగా సింజెంట, హైటెక్, బేయర్,శిబి, వంటి కంపెనీలు నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నాయనీ అన్నారు.ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే ఈ మోసాలు జరుగుతున్నాయనీ, నాణ్యమైన విత్తనాలపై భరోసా ఉంచిన గిరిజన రైతులు పూర్తిగా నష్టపోయారనీ అప్పుల్లో కూరుకుపోయిన కొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన విషాదకర ఘటనలు చోటు చేసుకున్నాయనీ తెలిపారు. ఇది కేవలం వ్యవసాయ విఫలత కాదు అమాయక గిరిజనులపై అవినీతి రాష్ట్ర ప్రభుత్వ కుట్ర అని వాపోయారు.బాధ్యులైన కంపెనీలపై పీడియాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని, రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనీ,భవిష్యత్తులో ఇటువంటి మోసాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలనీ తెలిపారు. బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాన డిమాండ్లు:నష్టపోయిన రైతులకు తక్షణంగా ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. నకిలీ విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలపై, అలాగే యజమానులపై పీడియాక్ట్ కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. బాధ్యులైన ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా నియంత్రణ చర్యలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలనీ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మంత్రి సీతక్కకు ఇసుక క్వారీలపై ఉన్న శ్రద్ధ, అందాల పోటీలపై ఉన్న ఆసక్తి గిరిజన రైతుల ఆత్మహత్యలపై ఏమాత్రం లేదని, వ్యవసాయ శాఖ మంత్రి కూడా స్పందించలేదని, ముఖ్యమంత్రి సమీక్షలు చేస్తున్నా, గిరిజన రైతుల విషయంలో పూర్తిగా విస్మరించారని, మంత్రివర్గంలో ఒక్క గిరిజన మంత్రిని కూడా నియమించని ఈ ప్రభుత్వ ధోరణి గిరిజనుల పట్ల అవమానకరంగా ఉంది,అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈయొక్క కార్యక్రమంలో బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేనావత్ రవి నాయక్,రాష్ట్ర కార్యదర్శి కుంజా సంతోష్,రాష్ట్ర నాయకులు మహేష్ రూపావత్,బానోత్ అనూష, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments