
భారీస్థాయిలో వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ
పయనించే సూర్యుడు జూన్ 5( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
2014 ఎన్నికల సమయంలో అబద్దపు హామిలతో గద్దెనెక్కారు, ప్రజలను మోసం చేశారు, మళ్లీ 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రజలకు ఎన్నికల సమయంలో హామిలను అమలు చేయకుండా చేశారు, ఇలా చేయడం వెన్నుపోటు పొడిచారు. నమ్మించి నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలకు గుర్తు చేసేందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు.రాష్ట్ర వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరు పట్ట్టణంలో భారీస్థాయిలో నాయకులు, కార్యకర్తలతో కలసి నిర్వహించారు. తొలుత మున్సిపల్ బస్టాండ్ లో నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఆర్డీఓ కార్యాలయంలో కార్యాలయ నిర్వహణాధికారి శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్కహామిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే 90 శాతం హామిలను అమలు చేశారన్నారు. 53 శాతం ఓట్లతో రాష్ట్ర చరిత్రలో ఎవరూ గెలవలేని విధంగా కూటమి ప్రభుత్వం గెలిచిందని, అయితే ఒక్క ఏడాదిలోనే ప్రజల నుంచి వ్యతిరేకత అందుకుంటుందన్నారు.
మా ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రం మరో శ్రీలంక అయిపొందని, ప్రజలంతా ఇబ్బంది పడుతారంటూ ప్రతి సమావేశంలో చెప్పారన్నారు. అలాంటి చంద్రబాబు ఎన్నికల సమయంలో అలివి కాని హామిలు ఇచ్చి 40 ఏళ్ల అనుభవం ఉన్న తాను సంపద సృష్టించి అందరికి సంక్షేమాన్ని అందచేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం చేయగలిగిందే చెప్పారన్నారు.ఇలా అలివి కాని హామిలిచ్చిన చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకుండా రూ.1.50 లక్షల కోట్లు అప్పులు చేశారని, అప్పట్లో జగన్ ఒక్క రూపాయి అప్పు చేస్తే ఇప్పుడు చంద్రబాబు రూ.44 అప్పు చేస్తూ అటు సంక్షేమాన్ని అమలు చేయక, ఇటు అభివృద్దిని చూపకపోవడంతో ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ ల కేసులు పెడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని, ఇది ప్రజలంతా గమనిస్తున్నారని పేర్కొన్నారు.ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేయని హామిలపై ప్రజలంతా ప్రశ్నించాలని, మీకైనా ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో తెలుస్తుందన్నారు. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నది ఒక్కటేనని మీరు అమలు చేస్తారా లేదా అని సమాధానం చెప్పాలని, అమలు చేయలేమంటే ఇక ప్రజలను ఆశపెట్టుకోవద్దని మేమే చెబుతామని, మా ప్రభుత్వం వచ్చిన తరువాత సంక్షేమాన్ని అందిస్తామని చెబుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గం అన్ని మండలాల మండల నాయకులు కార్యకర్తలు యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు
