Thursday, June 5, 2025
Homeఆంధ్రప్రదేశ్నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే సాధ్యం..

నాణ్యమైన విద్య ప్రభుత్వ పాఠశాల ద్వారా మాత్రమే సాధ్యం..

Listen to this article

ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు అందరు కృషి చేయాలి..

బడిబాట కార్యక్రమంపై అధికారులతో సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు మే3 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ పాఠశాలలలో అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రవేశాలను పొందేలా బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ జిల్లా అధికారులను ఆదేశించారు.మంగళవారం ఐ.డి. ఓ.సి, కార్యాలయం లో లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులతో కూడిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 6 వ తేదీ నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు, డిజిటల్ విద్య , ఉపకార వేతనాలు, ఇతర ప్రోత్సాహకాల గురించి అందరికీ తెలియజేసి, వారందరినీ ప్రభుత్వ బడుల్లో చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.6 నుండి 14 సం. వయసు కలిగిన బడిఈడు పిల్లలందరిని గుర్తించి, సమీపంలోని బడికి వెళ్లేలాగా ప్రోత్సహించాలన్నారు.మధ్యలో బడి మానివేసిన పిల్లలను గుర్తించి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులతో, మహిళా సమాఖ్యల ద్వారా, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, అర్హత కలిగిన తరగతుల్లో తిరిగి చేర్పించేలా క్షేత్రస్థాయిలో చర్యలు కోవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో లభించే నాణ్యమైన విద్య గురించి అందరికీ అవగాహన కల్పించాలన్నారు. బడిబాట కార్యక్రమంలో మహిళా స్వయం సహాయక సంఘాలు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను భాగస్వామ్యం చేయాలని అన్నారు.బడిబాట కార్యక్రమంలో అధికారులు ప్రభుత్వ పాఠశాలలకు ఎవరైతే పిల్లలను పంపించడానికి ఇష్టపడటం లేదో దానికి గల కారణాలను నమోదు చేయాలన్నారు. ప్రతి ప్రధానోపాధ్యాయులు గ్రామాలలో తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలు అందించే నాణ్యమైన విద్య గురించి వారికి అవగాహన కల్పించి తల్లిదండ్రుల యొక్క డబ్బు వృధా కాకుండా చూడాలన్నారు. జిల్లావ్యాప్తంగా రానున్న రెండు వారాల్లో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను గుర్తించి వాటికి తగిన మరమ్మతులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ విద్యా సంవత్సరం పూర్తయ్య నాటికి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు మట్టి ఇటుకలతో ప్రహరీ గోడల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రానున్న ఐదు రోజుల్లో ఏకరూప దుస్తుల తయారీ పూర్తి చేసి అన్ని పాఠశాలలకు అందించాలని అధికారులను ఆదేశించారు. భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి వారికి అవసరమైన వైద్య సదుపాయాలు మరియు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉల్లాసం యాప్ ద్వారా 15 సంవత్సరాల కంటే పైబడిన వయస్సు వారిలో నిరక్షరాశులను గుర్తించి వారికి అభ్యాసం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో 100% అక్షరాస్యత సాధించే విధంగా తగిన ప్రణాళికలు రూపొందించాలన్నారు. అదేవిధంగా ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణ పై అవగాహనలో భాగంగా, పాఠశాలల్లోని ఎకో క్లబ్స్ ఆధ్వర్యంలో, సీడ్ బ్యాంకు ద్వారా విత్తనాలు ఎక్కువగా సేకరించిన పాఠశాలలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలో 100% ప్లాంటేషన్ పూర్తి చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో తులసి,చింత, ఉసిరి, వెలగ, మునగ మరియు కరివేపాకు చెట్లు విస్తృతంగా నాటాలన్నారు. జిల్లావ్యాప్తంగా అజోల్ల, బయోచార్, కంపోస్ట్ ఎరువుల తయారీ, ఇంకుడు గుంతల నిర్మాణం, ఫామ్ పౌండ్స్ నిర్మాణం వంటి అంశాలపై విస్తృతంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమన్వయ సమావేశంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు పి. పి.టి లతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు అవగాహన కల్పించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సిపిఓ సంజీవరావు, మెప్మా పీడీ రాజేష్,జిల్లా విద్యాధికారి ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా బిసి సంక్షేమ అధికారి ఇందిర, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు, ఏపీఎంలు మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments