
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మే 31
ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ 1970 తర్వాత గిరిజనయేతరులు ఏజెన్సీలోకి విచ్చలవిడిగా అక్రమంగా చట్టాన్ని ఉల్లంఘించి వ్యాపారాల కోసం వలస వచ్చి వ్యాపార దుకాణాలు నిర్మించి అక్రమ ఇంటి నిర్మాణ నిర్మించి ఏజెన్సీ భూములను ప్రభుత్వ భూములను ఆదివాసి భూములను ఏజెన్సీ మండల కేంద్రం లో R&B స్థలాలను, పంచాయితీ భూములను ఆక్రమించి నివసిస్తూ ఉండటమే కాకుండా ఎంతో మంది ఆదివాసి భూములను లాక్కోవడం జరిగింది .అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో విద్య ఉద్యోగ ఉపాధి ఫలాలను కూడా ఆదివాసులకు దక్కకుండా చేస్తున్నారు అని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను ఆవేదన వ్యక్తపరిచారు. ఆదివాసీల పోరాట ఫలితంగా దశాబ్దల కాలం తర్వాత ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి ఏజెన్సీ ప్రాంతంలో మండల కేంద్రాల్లో ప్రధాన రహదారులకు ఇరువైపులా భూములను ఆక్రమించుకొని వ్యాపారం చేసుకుంటూ చట్టానికి విరుద్ధంగా నివసిస్తున్నటువంటి వారిపై చర్యలు తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆయన అన్నారు. ఆదివాసి సంక్షేమ పరిషత్ ఎన్నో ఏళ్లపాటు నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలపై, 1/ 70 చట్టం అమలుపై నిరంతర పోరాటం కొనసాగిస్తుందని, దాని ఫలితమే నేడు అక్రమ కట్టడాలు తొలగింపని అక్రమ కట్టడాలు తొలగించడానికి ఉద్యమించిన ప్రతి ఆదివాసికి ,మరియు ఇతర ఆదివాసి సంఘాలకు, ఇప్పటికైనా స్పందించిన ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు కూడా ఉద్యమ అభినందనలు అని ఆయన తెలియజేశారు. ఆక్రమాలు తొలగించినప్పటికీ నాన్ ట్రైబల్స్ ఏజెన్సీ ప్రాంతాన్ని వీడకుండా అమాయక ఆదివాసులను మభ్యపెట్టి వాళ్ళ భూముల్లో తిష్ట వేసి బినామీ పేరుతో మల్ల అక్రమ కట్టడాలు కట్టి ఏజెన్సీ లోనే నివసించే ప్రమాదం ఉంది. కావున తక్షణమే వాళ్ళందరినీ వాళ్ళ సొంత మైదాన ప్రాంతాలకు తరలించాలని , 1959-1/59, 1970 -1/70 ఎల్ టి ఆర్ చట్టం నీ ఉల్లంఘించి ఎవరైతే ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి ఆదివాసి భూములను కొల్లగొడుతూ, ప్రభుత్వ భూములను ఆక్రమిస్తూ, అక్రమంగా వ్యాపారాలు చేస్తూ, ఏజెన్సీలో నివసిస్తున్నారో వారిపై ఆదివాసి సంక్షేమ పరిషత్ పోరాటం ఆగదు ఆని ఆయన అన్నారు. ఇప్పటికైనా వలస గిరిజనేతరులు తమ అక్రమాలను ఆపకపోతే ఇంతకు ఇంత అనుభవిస్తారని ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గ కుండ అక్రమాలను కూలుస్తున్నటువంటి అధికారులకు వారికి రక్షణగా ఉంటున్నటువంటి పోలీస్ శాఖ వారికి ప్రత్యేక అభినందనలు అని ఆయన తెలిపారు ఇటువంటి మంచి కార్యాన్ని ఎవరైనా రాజకీయ పార్టీలు తరఫున అడ్డుకోవాలని చూస్తే భవిష్యత్తులో వాళ్లకి రాజకీయ భవిష్యత్తు ఉండదని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రంపచోడవరం ఐటీడీ పరిధిలో కొనసాగుతున్నటువంటి అక్రమాల తొలగింపు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఐదో షెడ్యూల్ భూభాగంలోని అన్ని నాన్ ట్రైబల్ అక్రమాలు తొలగింపు కొనసాగాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అక్రమాలు తొలగించిన గిరిజన యేతరుల యొక్క ఏజెన్సీలోని గుర్తింపు కార్డులను ఏజెన్సీలో వాళ్ళు పొందుతున్న పథకాలను తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే నాన్ ట్రైబల్స్ ఆధీనంలో ఉన్న ఆదివాసి వ్యవసాయ భూములను కూడా ఆదివాసులకు ఇప్పించేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు . భవిష్యత్తులో ఏజెన్సీ చట్టాలు అమ్ములుకై ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) నిరంతర పోరాటం కొనసాగిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పోరాటంలో ప్రతి ఆదివాసి కూడా రాజకీయాలకు ఆతీతంగా తమ రాజ్యాంగ హక్కులు కాపాడుకోవడం కోసం కలిసి రావాలని పిలుపునిచ్చారు.