Tuesday, June 3, 2025
Homeఆంధ్రప్రదేశ్నారాయణ పేట - మక్తల్ - కొడంగల్ ఎత్తిపోత వెంటనే పూర్తి చేయాలి

నారాయణ పేట – మక్తల్ – కొడంగల్ ఎత్తిపోత వెంటనే పూర్తి చేయాలి

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ నారాయణపేట జిల్లా ముక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ తేదీ 21 మే

నారాయణ పేట జిల్లా రైతులకు సాగునీరు మరియు ప్రజలకు త్రాగునీరు అందించే నారాయణ పేట – మక్తల్ – కొడంగల్ ఎత్తిపోతల పథకం వెంటనే పూర్తి చేయాలని జల సాధన సమితి జిల్లా కో కన్వీనర్ హెచ్.నర్సింహా బిజ్వార్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ ఎత్తిపోతలకు సంబంధించిన జీవో 69 జారీ చేసి మే 23 కు పదకొండు సంవత్సరాలు పూర్తి అయిన సాగునీరు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా చెందిన శాసన సభ్యులు ముఖ్యమంత్రి కావడం వలన ఈ ఎత్తిపోతల పథకం పూర్తి అవుతుందనే నమ్మకం జిల్లా రైతులకు ఉందని తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో పూర్తి చేసి సాగునీరు ఇస్తాం అని చెప్పారని గుర్తు చేశారు.ఇచ్చిన మాట ప్రకారం పైపు లైన్ పనుల సర్వే పూర్తి చేసి భూమి తీసుకోవడం చాలా సంతోషం అని అన్నారు. ఈ ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందించే రిజర్వాయర్ల కు భూమి సరిహద్దులు గుర్తించి వెంటనే ఎత్తిపోత పథకం పూర్తి చేసి సాగునీరు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.భూమి కోల్పోయిన రైతులకు ఎకరాకు నలభై లక్షలు మరియు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ ఎత్తిపోతలకు సంబంధించిన డిపిఆర్ విడుదల చేసి జిల్లాలో ఏయే గ్రామాలకు ఎన్ని ఎకరాలకు సాగునీరు వస్తుందో తెలుపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు తాయప్ప,చంద్రప్ప,చిన్న నర్సింహా, గుడిసె మహేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments