
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గం కన్వీనర్ శ్రీను నాయక్
( పయనించే సూర్యుడు జూన్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని నీరు పేదలకు ఇల్లు లేని పేదలకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు షాద్నగర్ నియోజకవర్గం కన్వీనర్ శీను నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన ప్రకటనలో తెలిపారు షాద్నగర్ నియోజకవర్గం పరిధిలోని అనేక గ్రామాల్లో ఇల్లు ఉన్నవారికి ఇంద్రమ్మ ఇండ్లను ఇచ్చి కట్టుకోండి అంటే ఎలా కట్టుకుంటారని అధికారులను ఆయన ప్రశ్నించారు ఇల్లు లేని వారికే ఇల్లు ఇచ్చి కట్టుకోండి అంటే కట్టుకుంటారు తప్ప ఇల్లు ఉన్నవాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కట్టుకోండి అంటే ఎలా సాధ్యమని ఆయన పంచాయతీరాజ్ అధికారులను ప్రశ్నించారు గ్రామాలలో నిజమైన లబ్ధిదారులు పూరిగుడిసెలో ఉన్నవారు ఇల్లు కూలడానికి ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఆయన అన్నారు ప్రజలు ప్రతిరోజు ఆఫీసులో చుట్టూ తిరిగితే లిస్టులో మా పేరు లేదు నాకు ఇల్లు ఇప్పిండి అని అనేకమంది ప్రజలు తిరుగుతున్న రెండవ లిస్టులో మూడవ లిస్టులో మీ పేరు వస్తుందని కాలయాపన అధికారులు చేస్తున్నారని ఆయన విమర్శించారు ఇప్పటికైనా అధికారులు అధికార పార్టీ నాయకులు లబ్ధిదారులను గుర్తించి ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయాలని మరియు ఇల్లు లేని వారికి ప్రభుత్వమే ఇంటి జాగా ఇచ్చి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిచో ఆందోళన కార్యక్రమం చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కొత్తగా వృద్ధాప్య పెన్షన్లు.. ఒంటరి మహిళ పెన్షన్స్ మరియు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులను వెంటనే ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు