
పయనించే సూర్యుడు జూన్ 19 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ గ్రామీణ ప్రాంతాలలో నూతన బస్సు రూట్ సర్వీస్ ప్రతిపాదనలు సిద్ధం చేయాలిగురుకులాల్లో మంజూరైన సీట్లను పూర్తి స్థాయిలో నింపాలిప్రతి గురుకులంలో తప్పనిసరిగా దోమల మెష్ జాలి ఏర్పాటు చేయాలి గురుకులాలను రెగ్యులర్ గా ఉన్నతాధికారులు తనిఖీ చేయాలి ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి అధికారులతో వివిధ పథకాలపై రాష్ట్ర బిసి సంక్షేమం, రవాణా శాఖల మంత్రితో కలిసి సమీక్షించిన డిప్యూటీ సిఎం. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం పక్కాగా గురుకులాలను నిర్వహించాలని డిప్యూటీ సి.ఎం. భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
బుధవారం రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థాయి అధికారులతో వివిధ పథకాలపై రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ లతో కలిసి సమీక్షించారు.గురుకులాల నిర్వహణ, స్టడీ సర్కిల్ పని తీరు, గ్రామీణాభివృద్ధి శాఖ, రవాణా శాఖ, విద్యుత్ శాఖ పని తీరు, చేపట్టిన అభివృద్ధి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సంబంధిత అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గురుకులాల పాఠశాలల ప్రారంభం నాటికి పిల్లలకు అవసరమైన పాఠ్య పుస్తకాలు, ఏక రూప దుస్తులు పంపిణీ చేయాలని, దీనికి అవసరమైన నిధులు ముందుగానే విడుదల చేయడం జరిగిందని అన్నారు. సరైన వసతులు లేని గురుకులాల భవనాలను అవకాశం ఉన్నచోట ప్రత్యామ్నాయ భవనాలకు మార్చేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.గురుకుల పాఠశాలల్లో పిల్లలకు దోమలు కుట్టి ఇబ్బంది పడటానికి వీలు లేదని, ప్రతి గురుకులంలో పూర్తి స్థాయిలో మెష్ జాలీ లు ఏర్పాటు చేయాలని అన్నారు. హాస్టల్స్ లో అవసరమైన మరమ్మత్తు పనులు పూర్తి చేయాలని అన్నారు. 40 శాతం డైట్ చార్జీలు, 200 శాతం కాస్మోటిక్ చార్జీలను ప్రభుత్వం పెంచిందని అన్నారు. కామన్ డైట్ ప్రోగ్రాం సంబంధించి షెడ్యూల్ తప్పనిసరిగా డిస్ ప్లే చేయాలని అన్నారు.
జిల్లాలో కలెక్టర్, అదనపు కలెక్టర్, ఉన్నతాధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు గురుకులాలను రెగ్యులర్ గా తనిఖీ చేయాలని, దీనికి సంబంధించి షెడ్యూల్ తయారు చేయాలని అన్నారు. గురుకులాల పరిసరాల్లో పండ్ల మొక్కలను పెద్ద స్థాయిలో పెంచాలని, దీనివల్ల పచ్చదనం పెరగడంతో పాటు విద్యార్థులకు కూడా పౌష్టికాహారం అందుతుందని అన్నారు.వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో కోటి మొక్కల వరకు పెంచుతున్నామని అన్నారు. ప్రతి మొక్క మీద ప్రభుత్వం కనీసం 300 రూపాయల వరకు ఖర్చు చేస్తుందని, ఒక జిల్లాలో సంవత్సరానికి 300 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సర్వైవల్ పై శ్రద్ద పెట్టాలని అన్నారు. గతంలో నాటిన మొక్కలలో ఎన్ని బ్రతికాయో వాస్తవిక రిపోర్ట్ అందించాలని అన్నారు.
గురుకులాల భవనాలకు సంబంధించి రెంట్, డైట్ చార్జీల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం విడుదల చేస్తుందని, పిల్లలకు నాణ్యమైన విద్య, భోజనం అందేలా అధికారులు పట్టిష్ట చర్యలు చేపట్టాలని అన్నారు.మహిళలకు ఉచిత బస్సు అందించడంతో పాటు అది సౌకర్యవంతంగా ఉండేలా మనం చర్యలు చేపట్టామని, డిమాండ్ ఉన్న రూట్ లలో అదనపు బస్సులు నడపాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నూతన బస్సు రూట్ లను గుర్తించి ప్రతిపాదనలు అందిస్తే నూతన బస్సులు కొనుగోలు చేసి పంపడం జరుగుతుందని అన్నారు.
సమీక్ష లో రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో గురుకులాలలో చేపట్టిన చర్యలు, గీత కార్మికులకు కాటమయ్య రక్షక కిట్లను పంపిణీ, వన మహోత్సవం కార్యక్రమంలో తాటి, ఈత ఖర్జూర మొక్కల పెంపకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటివి సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.గురుకులాల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగ్గు పర్చాల్సిన అవసరం ఉందని, ఐఐటి, నీట్ వంటి పరిక్షలలో మంచి ఫలితాలు సాధించేలా శిక్షణ అందించాలని అన్నారు. పెరిగిన డైట్ చార్జీలు వినియోగిస్తూ ప్రభుత్వం సూచించిన కామన్ డైట్ కార్యక్రమం పక్కాగా అమలు చేయాలని అన్నారు.గురుకులాలో మంజూరైన సీట్లు పూర్తి స్థాయిలో నింపాలని, సొంత భవనాలు లేని గురుకులాలకు అవసరమైన భూమి గుర్తించాలని, ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న నిధుల ప్రకారం నిర్మించడం జరుగుతుందని తెలిపారు.గ్రామీణ యువతకు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ లో బీసీ స్టడీ సర్కిల్ నందు శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించేలా చూడాలని అన్నారు. హైదరాబాద్ కు రావాల్సిన అవసరం లేకుండా అవసరమైన అన్ని రకాల పుస్తకాలు, శిక్షణ మన ఖమ్మంలో అందించాలని అన్నారు.
ప్రస్తుత సంవత్సరం వన మహోత్సవం కార్యక్రమంలో 81 వేల ఈత మొక్కలు నాటేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేయాలని, గీత కార్మికుల సోసైటీ లను వీటిలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేస్తూ కాలువల వెంబడి, ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలాల్లో వీటిని పెద్ద ఎత్తున పెంచాలని అన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత నూతన బస్సు సర్వీసుల కోసం డిమాండ్ వస్తుందని,స్థానిక ఎమ్మెల్యేల నుంచి బస్సు సర్వీసుల ప్రతిపాదనలు తీసుకొని అందించాలని, డిమాండ్ కు అనుగుణంగా అదనపు బస్సులను కేటాయిస్తామని, రాబోయే రోజులలో హైదరాబాద్ కు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే నేపథ్యంలో జిల్లాలకు అదనపు బస్సులు అందుతాయని మంత్రి తెలిపారు.నగర పరిధిలో పీఎంఈ స్కీం కింద ఎలక్ట్రిక్ బస్సుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో రూరల్ కనెక్టివిటీ బస్సుపై స్టడీ చేసి నూతన రూట్ లను ప్రతిపాదించాలని అన్నారు. లాండ్రీ లకు, దోబి ఘాట్, సెలూన్ లకు విద్యుత్ సరఫరా సజావుగా అందాలని అన్నారు. గురుకులాల పరిధిలో పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, హస్త కళా చైర్మన్ నాయుడు సత్యనారాయణ, నగర మేయర్ పునుకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.