Tuesday, June 3, 2025
Homeఆంధ్రప్రదేశ్నిర్మల్ జిల్లా బోరిగాం గ్రామ దళితులపై కులోన్మాధులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

నిర్మల్ జిల్లా బోరిగాం గ్రామ దళితులపై కులోన్మాధులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

Listen to this article

దళితులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి, కేసులు నమోదు చేయాలి

పోలీసుల,అధికారుల నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా నిరసిస్తున్నాం.

అంబేద్కర్ యువజన సంఘం,మక్తల్

పయనించే సూర్యుడు// న్యూస్ మే 21//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//

మక్తల్ పట్టణ కేంద్రంలోని విశ్రాంతి గృహం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ మాట్లాడుతూ
నిర్మల్ జిల్లా,ముథోల్ మండలం, బోరిగాం గ్రామంలో గల ప్రభుత్వ భూమిలో పెద్దల తీర్మానం ప్రకారమే బుద్ధ పౌర్ణమి సందర్భంగా బుద్ధ విగ్రహా ప్రతిష్టాపన చేసుకుంటున్న దళితులపై అగ్రకుల అహంకారంతో దాదాపు 500 మంది మూకుమ్మడిగా దాడి చేయడాన్ని అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ గా తీవ్రంగా ఖండిస్తున్నాం.కులం పేరుతో దూషిస్తూ మహిళలను,వృద్ధులను సైతం పిడుగుద్దులు గుద్దుతూ వీరంగం సృష్టించిన కులన్మాదులను వెంటనే అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ ఘటన జరిగి వారం రోజులు కావస్తున్న మాపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోమని దళితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కేసులు నమోదు చేయకుండా పోలీసులు అధికారులు ప్రభుత్వ యంత్రాంగం దళితుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఇటువంటి క్రమంలో దళితుల పట్టణ అండగా ఉండాల్సింది పోయి దాడులకు తెగబడుతున్న వారిపట్ల కొమ్ము కాస్తుండటం ఎంత మాత్రం తగదని వెంటనే ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణ జరిపించి దళితులపై దాడికి పాల్పడిన వారందరిపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అంబేద్కర్ యువజన సంఘం మక్తల్ గా హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజ్ ప్రధాన కార్యదర్శి బండారి కృష్ణ ఉపాధ్యక్షులు బ్యాగరి వెంకటేష్, కార్యవర్గ సభ్యులు కర్రెమ్ అంజయ్య, కర్రెన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments