Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్నీటిని వదిలిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

నీటిని వదిలిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్ జూన్ 7//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//

మక్తల్ నియోజకవర్గం చిన్నగోపులాపూర్ స్టేజ్-1 నుండి నేడు ఓపెన్ కెనాల్ ద్వారా భూత్పూర్ రిజర్వాయర్, సంగంబండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేసిన మక్తల్ నియోజకవర్గ శాసన సభ్యులు డా” వాకిటి శ్రీహరి అనంతరం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఎగువన ఉన్న మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాలకు గాను భీమా నది ఎక్కువగా మారడంతో జూరాల ప్రాజెక్టులో నీటి సామర్థ్యం పెరగడంతో మన మక్తల్ నియోజకవర్గం లోని రాజీవ్ ఎత్తిపోతల పథకం స్టేజి-1 నుండి నేడు నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు.ఇప్పటివరకు స్టేజ్ -1 మూడు పంపులు ఉండగా ఇప్పటివరకు కేవలం రెండు పంపులు మాత్రమే ఉపయోగంలో ఉండగా మూడవ పంపు 2018 ఉంది నిరూప యోగంగా ఉండగా అందుకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూడవ పంపు గాను గత సంవత్సరం డిసెంబర్లో ఒక కోటి నాలుగు లక్షల రూపాయల నిధులను మూడో పంపు మరమ్మత్తుల నిమిత్తం నిధులను విడుదల చేయడం జరిగిందని అన్నారు.గత సంవత్సరం జూన్ 13న నీటిని విడుదల చేయగా ఈ సంవత్సరం ఒక వారానికి ముందే నీటిని విడుదల చేయడం జరిగిందని అందుకు స్టేజ్ వన్ లోని సాంకేతికపరమైన యంత్రాలను పూర్తిస్థాయిలో ఆధునీకరణ చేసే అన్ని యంత్రాలను పనిచేసే విధంగా ఏర్పాటు చేయడానికి నిధులు సమకూర్చినటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి పెద్దలు ఉత్తంకుమార్ రెడ్డి కి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు యనుమల్ల రేవంత్ రెడ్డి కి మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు మరియు చుట్టుపక్కల గ్రామాల రైతులు సంబంధిత ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments