Sunday, June 8, 2025
Homeతెలంగాణనూతన పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడుగా రాజు రామ్ చందర్ ఎన్నిక

నూతన పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడుగా రాజు రామ్ చందర్ ఎన్నిక

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 07 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ కమిటీ సమావేశం శనివారం జరిగింది.ఈ సమావేశంలో టేకులపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గా పాస్టర్ జి రాజు రామ్ చందర్, జనరల్ సెక్రెటరీగా పాస్టర్ తవుడోజు బోయాజ్, వైస్ ప్రెసిడెంట్ గా పాస్టర్ ఉండం నరేష్ , జాయింట్ సెక్రటరీగా పాస్టర్ ఎం మార్కు, కోశాధికారిగా పాస్టర్ జి తిమోతి, కార్యవర్గ సభ్యులుగా పాస్టర్ బి అబ్రహం, సిస్టర్ కె స్వతంత్ర,గౌరవ సలహాదారులుగా పాస్టర్ ఎన్ దావీదు లను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ మండలంలోని సంఘాలను అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తామని, ప్రభుత్వ పథకాలు ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలాలు ఇచ్చి మంజూరు చేయాలని క్రైస్తవ సమావేశ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయగలరని ప్రభుత్వాన్ని కోరుతూ క్రైస్తవ సమాధుల స్థలం మండలంలో కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో పాస్టర్ జాన్ రాజ్, పాస్టర్ దయాకర్, పాస్టర్ వి మార్కు, పాస్టర్ పి పిల్లి అబ్రహం, ఆంధ్రయ, పాస్టర్ సిల్వరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments