Monday, October 27, 2025
Homeఆంధ్రప్రదేశ్నేరెళ్ల పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ – సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్...

నేరెళ్ల పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ – సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశాలు

Listen to this article

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

ప్రభుత్వ వైద్య సేవలపై వివరించాలి

విధులకు గైర్హాజరైన ఇద్దరికి షోకాజ్ నోటీసులు జారీ

ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్

నేరెళ్ల పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీ

పయనించే సూర్యుడు, అక్టోబర్ 27( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్

సీజనల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే వారికి అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం లోని నేరెళ్ల పీహెచ్ సీ ని ఇంచార్జి కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైద్యులు, సిబ్బంది హాజరు రిజిస్టర్, రక్త పరీక్షలు చేసే ల్యాబ్, మందుల గది, ఇతర గదులు, ఆవరణ పరిశీలించారు. వ్యాక్సిన్లు, మందుల నిలువుపై ఆరా తీశారు. ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైన ఫార్మసిస్ట్, సూపర్వైజర్ కు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. ఆసుపత్రికి ఎందరు రోగులు వస్తున్నారని, ఎందరు గర్భిణులు వైద్య సేవలు పొందుతున్నారని ఆరా తీశారు.ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడారు. వైద్యులు, సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ వైద్య సేవలపై అందరికీ అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, పరిసరాల పరిశుభ్రతపై వివరించాలని తెలిపారు. గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.ఇక్కడ నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments