
( పయనించే సూర్యుడు జూన్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం లోని కొందుర్గు లో జరిగిన కుంఫు గ్రేడింగ్ టెస్ట్ లో వివిధ మండలాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభను కనబరిచారు. కొందుర్గు మండలంతో పాటు పలు మండలాల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని నేర్చుకున్న ట్రైనింగును అద్భుతంగా ప్రదర్శించి తదుపరి ట్రైనింగ్ కోసం బెల్టులు తీసుకోవడం జరిగింది. ఈ బెల్ట్ టెస్టులో దాదాపు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ బెల్ట్ గ్రేడ్ పరీక్షకు కొందుర్గు మండల మాజీ జెడ్పిటిసి రామకృష్ణ మాజీ ఎంపీటీసీ ఆకుల మానయ్య తెలంగాణ రాష్ట్ర న్యూ మాంక్స్ కుంఫు చీఫ్ ఇన్స్ట్రక్టర్ జిల్లెల్ల రమేష్ మాస్టర్ వనపర్తి పట్టణానికి చెందిన రాము మాస్టర్ మరియు సీనియర్ బ్లాక్ బెల్ట్ ఇన్స్ట్రక్టర్స్, బాలరాజ్, నందు, రాజు, నరేష్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
