
సమావేశం నిర్వహించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జూన్ 2 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాల్లో నెలకొన్న పలు సమస్యలు, పెండింగ్ పనులు, చేపట్టాల్సిన ప్రతిపాదిత అభివృద్ధి పనులపై నేడు రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.షాద్ నగర్ నియోజక వర్గంలో నెలకొన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సౌకర్యార్థం ప్రథమ ప్రాధాన్యతగా పనులు చేపట్టాలని, కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. టెండర్లు పూర్తయిన పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు.మౌలిక వసతుల కల్పనలో అలసత్వం ప్రదర్శించకుండా త్వరితగతిన పూర్తి చేయాలని, షాద్ నగర్ నియోజకవర్గ సమగ్ర అభివృద్దే ధ్యేయంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీరామ్ రాములు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
