
జనం న్యూస్. మే 30. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్)
పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిన్నారం సీఐ నయీముద్దీన్ అన్నారు,రాబోయే బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని శుక్రవారంనాడు మండల కేంద్రమైన హత్నూర పోలీస్ స్టేషన్లో ఎస్సై శ్రీధర్ రెడ్డి.అధ్యక్షతన శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ నయీముద్దీన్ మాట్లాడుతూ,పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని అందరూ కలిసిమెలిసి ఉండాలని సూచించారు, పండుగను ప్రశాంతముగా జరుపుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరపున పూర్తి సహకారం ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామని, అన్నారు అదేవిధంగా అన్య మతాల వారు పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని పోలీస్ వారికి చేరవేయాలి గాని,వాళ్ళే వాహనాలను ఆపడం,చెక్ చేయడం లాంటివి చేస్తూ,శాంతి భద్రత లకు విఘాతం కలిగించే విధముగా ప్రవర్తిస్తే వారిపై చట్ట రీత్యా చర్యలు ఉంటాయని, చట్ట ప్రకారంగా అందరూ నడుచుకోవాలని,పోలీస్ వారికి సహకరించాలన్నారు.మత విద్వేషాలు రెచ్చగొట్టకూడదని ఏదైనా విశ్వసనీయ సమాచారం ఉంటే పోలీసు వారికి తెలియజేయాలని తెలిపారు,ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఎం ఏ హకీమ్ , దౌల్తాబాద్ మాజీ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, హత్నూర మాజీ సర్పంచ్. వీరస్వామి గౌడ్,ఆకుల కిష్టయ్య.మాజీ వార్డు సభ్యులు గౌస్ పాషా, ఖదీర్. నల్లోల్ల పెంటయ్య. ఆకుల నరేందర్.వహీద్ ఖాన్. అజీజ్ పాషా, వాజిద్. ఇస్మాయిల్. అజ్జు. ప్రవీణ్ గౌడ్. చాకలి వీరేశం.వివిధ మత పెద్దలు, పార్టీల నాయకులు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
