
▪️రేపటి నుండి పదవ తరగతి పరీక్షలు ప్రారంభం..
పయనించే సూర్యడు // మార్చ్ // 20 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..
తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం పక్షాన పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర రోడ్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శుభాకాంక్షలు,అభినందనలు, ఆశీర్వాదాలు తెలిపారు.
విద్యార్థినీ విద్యార్థులు, జీవితంలో ఏ పరీక్షలు రాసిన ఏ ఉన్నత శిఖరాలకు వెళ్ళిన పదవ తరగతి పరీక్షల మార్కుల మేమో ముఖ్యమైంది అని అన్నారు.అందరూ కస్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలి అని కోరారు.పిల్లలు చదువుకోవడానికి మంచి అవకాశం ఇచ్చి పిల్లల ఉజ్వల భవిష్యత్ కి తోడ్పడాలన్నారు.విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని ప్రభుత్వం పక్షాన పొన్నం ప్రభాకర్ ఆశీర్వాదించారు.