
ఉపాధి హామీ కూలీల ఆవేదన.
పయనించే సూర్యుడు; మే 21: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని మురుమూరు గ్రామపంచాయతీలోనీ కొప్పుసూరు, గణపురం కాలనీ మొట్ల గూడెం, ఘనపురం,అరుణాచలం ప్రజలు మాట్లాడుతూ గత ఏప్రిల్ నెల నుండి ఉపాధి హామీ కూలి పనులు చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఉపాధి హామీ వేతనాలు అకౌంట్లో పడటం లేదని ఈ యొక్క గ్రామస్తులు వాపోయారు. ఉపాధిహామీ చట్ట ప్రకారం పని చేసిన రెండు వారాలలోపే ప్రభుత్వం ఉపాధి హామీ కార్మికులకు అకౌంట్లో డబ్బులు జమ చేయాల్సింది ఉండగా ఇంకా డబ్బు జమ చేయకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకొని ఉపాధి హామీకార్మికులకు న్యాయం చేయాలని, సకాలంలో ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించాలని ఉపాధి హామీ కార్మికులు వేడుకున్నారు.