
పయనించే సూర్యుడు గాంధారి 25/06/25
పాఠశాలను ప్రారంభించిన జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మండల కేంద్రంలోని పల్లెల మడుగు తాండాలో ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ అధికారి రాజు ప్రారంభించారు. గత ఐదు సంవత్సరాల క్రితం మూతబడిన పాఠశాలను ప్రభుత్వ ఆదేశాల మేరకు 19 మంది విద్యార్థులతో ఈ పాఠశాలను ప్రారంభించామన్నారు. ఈ పాఠశాల పునర్ ప్రారంభానికి కృషిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయుడు పెంటయ్యను పాఠశాలను అభివృద్ధి పరచాలని తెలిపారు. మారుమూల ప్రాంతమైన గిరిజన తండాలను విద్యాభివృద్ధితో అభివృద్ధి పరచాలని సంకల్పంతో ప్రత్యేక కార్యచరణతో పాఠశాలను ప్రారంభించామన్నారు. పాఠశాల అభివృద్ధికి జిల్లా విద్యాశాఖ అధికారి 2000 రూపాయలను అందజేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థి రంజిత్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు డీఈఓ చేతుల మీదుగా అందజేశారు. పాఠశాల ప్రారంభంలో భాగంగా డి ఇ ఓ రాజు, ఏ ఎం ఓ వేణుగోపాల్, ఎమ్ ఇ ఓ శ్రీహరి మరియు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి ప్రారంభించారు. పాఠశాలను అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రకాష్, రమేష్, సి ఆర్ పి సాయిలు, మాజీ ఎంపిటిసి శంకర్ నాయక్, వార్డు మెంబర్ గణేష్ అంగన్వాడీ టీచర్ సునీత గ్రామస్తులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.