
పయనించే సూర్యుడు న్యూస్(జూన్.23/06/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం బత్తలవల్లం పంచాయతీ పరిధిలోని రాచకండ్రిగ గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్టు పంచాయతీ కార్యదర్శి యూసఫ్ ఖాన్ తెలిపారు. గ్రామం మొత్తం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, కూర్చునే ప్రదేశాల నుండి కాలువల వరకు శుభ్రంగా ఉంచేందుకు గ్రామస్థుల సహకారం అవసరమన్నారు. తడి చెత్త పొడి చెత్త వేరు వేరు గా తొలగించలని పంచాయతీ సిబ్బందిలకు ఆయన సూచనలు ఇచ్చారు క్రమం తప్పకుండా వ్యర్థాల పారుదల జరిగేలా పంచాయతీ సిబ్బందికి సూచనలు జారీ చేసినట్టు తెలిపారు.పరిశుభ్రతే ఆరోగ్యానికి మూలమని, అందరూ సహకరించాలని యూసఫ్ ఖాన్ గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.