Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్పాస్టర్ పగడాల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరగాలి. టేకులపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ ప్రెసిడెంట్...

పాస్టర్ పగడాల ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరగాలి. టేకులపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ ప్రెసిడెంట్ పాస్టర్ బి జాన్ రాజ్

Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ ఒకటి టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు)

టేకులపల్లి సోమవారం బి కాలనీ తండాలో పెంతే కోస్తూ ప్రార్ధన మందిరం పాస్టర్ రాజు రామ్ చందర్ చర్చిలో టేకులపల్లి మండల పాస్టర్ ఫెలోషిప్ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు . ఈ సమావేశంలో పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు, బల్లెం జాన్ రాజు, టీ బోయాజు లు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణలోని క్రైస్తవులు ఐక్యత వర్ధిల్లాల అన్నారు. హైదరాబాద్ నుండి బైక్ పై రాజమండ్రి వైపు వెళుతున్న పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణం బాధాకరమని పాస్టర్ మరణం పై పలు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రవీణ్ కుటుంబానికి ఆయన లేని లోటు పూడ్చలేనిదని ప్రగడ సానుభూతి తెలుపుతూ ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేకూరే వరకు న్యాయపోరాటం నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో కమిటీ పాస్టర్స్ రాజు రామ్ చందర్. కోశాధికారి హానోకు. కార్యవర్గ సభ్యులు దేవరాజ్. సభ్యులు పేతురు. స్టీవెన్. ప్రభుదాస్. రాజ్ కుమార్. దేవదాస్. ఆనంద్. సిస్టర్స్ తారాబాయి. సోనీమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments