
పయనించే సూర్యుడు మే 30 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతున్న ఏటీడీవో షేక్.జహీరుద్దీన్
ఏటిడిఓ: షేక్.జహీరుద్దీన్
ఏన్కూర్ /
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలను కాపాడుకోవాలని సహాయ గిరిజన సంక్షేమ అభివృద్ధి అధికారి షేక్.జహీరుద్దీన్ పిలుపునిచ్చారు. నాణ్యమైన విద్యపై గ్రామంలో అవగాహన కల్పించడానికి మరియు తల్లితండ్రులు తమ పిల్లల సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలలను ఇష్టపడేలా చూడడానికి యువత మరియు స్థానిక నాయకులతో శుక్రవారం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల మూలపోచారంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి. నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు,వర్క్ బుక్కులు, నాలుగు జతల దుస్తులు, ట్రంక్ బాక్స్ ఉచితంగా అందించబడుతున్నాయని, రోజు విడిసి రోజు ఉదయం పాలతో రాగి మాల్ట్, బూస్ట్, నాణ్యమైన అల్పాహారం రోజుకో రకం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, డిన్నర్, వారానికి ఐదు రోజులు అరటి పండ్లు, కోడిగుడ్లు, వారానికి నాలుగు సార్లు చికెన్, నెలకు రెండు సార్లు మటన్ తో పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తున్నారని వారు తెలియజేశారు.తల్లిదండ్రులు ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలు దోహదపడతాయని తెలియజేశారు.ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన, సువిశాలమైన తరగతి గదులు, గ్రంథాలయం,సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, విశాలమైన క్రీడా మైదానం, ఉచిత ఆరోగ్య పరీక్షలు,అనుభవజ్ఞులైన అత్యున్నత విద్యార్హతలు కలిగిన టీచర్లు ఉంటారని, విద్యార్థులకు వ్యక్తిగత శ్రద్ధ వహిస్తారని తల్లిదండ్రులకు తెలియజేశారు.కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు డిఎస్. నాగేశ్వరరావు,డిప్యూటీ వార్డెన్ బి.రవి, ఉపాధ్యాయులు ఎం. చందర్రావు, పి.శ్రీనివాస్,డి. వెంకట రమణమ్మ,శ్యామల, బి.శోభన్, వి.రమేష్, బి.సింగ్య,శ్రీరామ్,జే. నాగేశ్వర రావు నాలుగో తరగతి ఉద్యోగులు, తల్లిదండ్రులు,యువకులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
