
ఒకరికొకరు సన్మానించుకున్న విద్యార్థులు
పయనించే సూర్యుడు జూన్ 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
నాలుగు దశాబ్దాల క్రితం కలసి చదువుకున్న విద్యార్థులంతా ఒక్కచోట కలుసుకున్నారు. తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్దులు నేర్పి తమ ఎదుగుదలకు దోహదం చేసిన గురువులను సన్మానించుకున్నారు. ఇందుకు నెల్లూరులోని ఓ ప్రైవేట్ హోటల్ వేదికైంది.వివరాల్లోకెళితే మర్రిపాడు మండలం కంపసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1985-86లో పదో తరగతి చదివిన విద్యార్థులు నాలుగు దశబ్థాల షనంతరం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.సుమారు 30 మంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం కలుసుకోవడంతో వారు ఆనందంతో మునిగిపోయారు. చిన్ననాటి అనుభూతులు, జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా సాగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 సంవత్సరాల తరువాత ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఆనాటి మిత్రులను కలుసుకోవడం ఆనందంగా ఉందని, తమకు విద్య నేర్పిన నలుగురు గురులను సన్మానించుకోవడం మరింత సంతృప్తి నిచ్చిందని పేర్కొన్నారు.ఉద్యోగ, వ్యాపారరీత్యా ఎక్కడెక్కడో స్థిరపడి వాళ్లమంతా ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా కలుసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు. తమకు ఇంత వారిని చేసిన పాఠశాల అభివృద్ది కోసం తమవంతుగా ఏ సహాయమైనా చేసేందుకు సిద్దంగా ఉన్నామని, పాఠశాల అభివృద్ది కోసం ఓ కమిటిని ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారు.నాలుగు దశాబ్దాల అనంతరం ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసిన మా తోటి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, అలాగే మనమందరం మన పాఠశాల కోసం కమిటిగా ఏర్పడి అభివృద్దికి బాటలు వేసేందుకు నిలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.