
మండుటెండను లెక్క చేయకుండా కదం తొక్కిన ఉపాధి కూలీలు
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన కలెక్టరేట్ ముట్టడి
పయనించేసూర్యుడు జూన్ 06(పొనకంటి ఉపేందర్ రావు )
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధి హామీ కూలీలు అధికారులు బయటకు రావాలని ఆందోళన ఉధృతం చేసిన నేతలు, ధర్నా వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించిన అదికారులు. వేతనాలు వెంటనే విడుదల చేస్తామని అధికారులు హామీ .కొత్తగూడెంశుక్రవారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపాధి హామీ పథకం కూలీల వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, శుక్రవారం నాడు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు, ఈ సందర్భంగా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అద్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బడ్జెట్లో నిధులు తగ్గించడం వల్ల పని దినాలు తగ్గిపోయాయని, వేతనాలు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని విమర్శించారు, జిల్లా లో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి పని ప్రదేశాల్లో సంఘం కార్యకర్తలు విస్తృత పర్యటనలు చేశారని తెలిపారు,ఆ సందర్భంగా ఉపాధి కూలీల సమస్యలు బయటకు వచ్చాయని చెప్పారు, ముఖ్యంగా చేసిన పనికి పే స్లిప్పులు ఇవ్వడం లేదని, కనీసం ప్రభుత్వం ప్రకటించిన వేతనం కూడా ఇవ్వడం లేదని అన్నారు, మంచినీరు, టెంట్, మెడికల్ కిట్లు, రవాణా చార్జీలు లేకుండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉపాధి కూలీలు పని చేస్తున్నారని తెలిపారు, ప్రభుత్వం వెంటనే ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని, మౌలిక సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు,రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, శెట్టి వినోద లు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో అడవుల్లో, చెరువుల్లో పనులు చేస్తున్న కూలీల గురించి పాలకులు పట్టించుకోవడం లేదన్నారు,తమ గ్రామానికి నాలుగైదు కిలో మీటర్ల దూరంలో పనికి వెళ్తున్న కూలీలకు రవాణా చార్జీలు కూడా ఇవ్వకపోవడం విచారకరమన్నారు, పట్టాలిచ్చిన పోడు భూముల అభివృద్ధి పనులు అడ్డుకుంటున్న అదికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ మాట్లాడుతూ పని పూర్తి అయిన వారికి వెంటనే కొత్త పనులు కల్పించడంలో అదికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు, కొలతలతో సంబంధం లేకుండా వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు, కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు అప్పనంగా కట్టబెడుతున్న ప్రభుత్వం ఉపాధి కూలీలకు కనీస వేతనం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు, పని దినాలు ప్రతి కుటుంబానికి రెండు వందల రోజులకు పెంచాలని, ఆరు వందల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కలెక్టరేట్ లోకి వెళ్ళేందుకు ఆందోళన కారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు, అదికారులు బయటకు రావాలని నాయకులు పట్టుబట్టడంతో ఉద్రిక్తత నెలకొంది, గ్రామీణాభివృద్ధి అడ్మినిస్ట్రేటివ్ అదికారి ఆందోళన కారుల వద్దకు వచ్చి వినతి పత్రం స్వీకరించి, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు,కొత్తగూడెంకార్పోరేషన్ లో సుజాత నగర్ మండలం లోని గ్రామాలను కలపడం వల్ల అక్కడ పేదలకు ఉపాధి హామీ పనులు నిలిపివేశారని విమర్శించారు,పట్టణ ప్రాంతాల్లో కూడా ఉఫాది హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేశారు,.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, శెట్టి వినోద, జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు, బత్తుల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు నిమ్మల వెంకన్న, మర్మం చంద్రయ్య,ఆలేటి కిరణ్, జిల్లా కమిటీ సభ్యులు ఈసం నరసింహారావు, గండమాల భాస్కర్, నాగరత్నమ్మ,పిట్టల నాగమణి,కుర్సం లక్ష్మయ్య,మాలోత్ రావుజ,జోనెబోయిన నాగభూషణం, తేజావత్ వెంకన్న,కోట బాలకృష్ణ,సోల్తి రఘు తదితరులు పాల్గొన్నారు.
పట్నం నాయకులు కొండపల్లి శ్రీదర్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు కె.సత్య, జిల్లా కమిటీ సభ్యులు వీర్ల రమేష్, భూక్యా రమేష్, సత్రపల్లి సాంబశివరావు, రైతు సంఘం నాయకులు మోరంపూడి శ్రీనివాసరావు, సిపిఎం పాల్వంచ పట్టణ కార్యదర్శి తులసి రాం,మహిళా సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు అమల, జిల్లా కమిటీ సభ్యులు వాణి ,సరోజినీ లు సంఘీభావం తెలిపారు
.