
పొగాకు పై అవగాహన కల్పిస్తున్న డాక్టర్ అయోషా సిద్దికా..
రుద్రూర్, మే 31 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం గ్రామ ప్రజలకు పొగాకు పీల్చడం, నమలడం పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అయోషా సిద్దికా మాట్లాడుతూ.. పొగాకు పీల్చడం, నమలడం వలన క్యాన్సర్, పలు రకాల వ్యాధులు వ్యాపించి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. పొగాకు నుండి ఎలా బయటపడాలో వివరించారు. అదేవిధంగా ఆసుపత్రి సిబ్బందితో ప్రతిజ్ఞ చేస్తూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్ తరుణ్, ఆసుపత్రి వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.