Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రగతి నగర్ ఒకటవ సంక్షేమ సంఘం ఎన్నికలలో యాబై ఐదు ఓట్ల మెజారిటీతో మాచర్ల విష్ణు...

ప్రగతి నగర్ ఒకటవ సంక్షేమ సంఘం ఎన్నికలలో యాబై ఐదు ఓట్ల మెజారిటీతో మాచర్ల విష్ణు ఘనవిజయం

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి

బస్తీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా

ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన మాచర్ల విష్ణు

శేరిలింగంపల్లి నియోజక వర్గం, కూకట్ పల్లి డివిజన్ పరిధిలో గల ప్రగతి నగర్ ఒకటవ సంక్షేమ సంఘం ఎన్నికలు ఆక్స్ఫర్డ్ గ్రామర్ హై స్కూల్ లో సోమవారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. సంక్షేమ సంఘం ఎన్నికలలో అధ్యక్ష పదవికి మాచర్ల విష్ణు, మండల సువర్ణ, కవిత లు పోటీ చేశారు. బస్తీలో మొత్తం 161 పోలయ్యాయి. మాచర్ల విష్ణుకు తొంబై ఐదు ఓట్లు, కవితకు నలబై ఓట్లు, మండల సువర్ణకు ఇరవై ఆరు ఓట్లు పడ్డాయి. మాచర్ల విష్ణు కవితపై యాబై ఐదు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం మాచర్ల విష్ణు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రగతి నగర్ ఒకటవ లోగల ఇంటి యజమానులు నన్ను నమ్మి ఓటు వేసినందుకు వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రగతి నగర్ ను అభివృద్ధి పథంలో నడిపించేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు.నన్ను గెలిపించిన ఇంటి యజమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బస్తీలో ఏ చిన్న సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి అట్టి సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎల్లప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటూ బస్తీ సమస్యలు తెలుసుకుంటానని అన్నారు. అనంతరం కోశాధికారిగా రొక్కం శంకర్ రావు, ప్రధాన కార్యదర్శిగా లద్ది పీర్ల రఘు గౌడ్ లను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్ కమిటీ చైర్మన్ ఎల్ దిలీప్ గౌడ్, ఎలక్షన్ కమిటీ సభ్యులు బిక్షపతి, పవన్ కుమార్, నాగేందర్, వీరేశం, శ్రీరాములు, వెంకటేష్, శ్రీనివాస్, వాణి, అనిత, బ్రహ్మం, బాలరాజు, కాలనీ ఇంటి యజమాను తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments