Wednesday, June 25, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలి::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామ...

ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలి::రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామ కృష్ణా రావు

Listen to this article

ప్రతి పట్టణంలో కనీసం 500 మంది నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు

పెండింగ్ డబుల్ బెడ్ రూం ఇండ్లను లబ్దిదారుల ద్వారా పూర్తి చేయాలి

రైతులకు సమృద్ధిగా ఎరువుల సరఫరాకు పకడ్బందీ చర్యలు

లక్షా 25 వేల ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగు విస్తీర్ణ లక్ష్యంగా చర్యలు

ఆగస్టు 15 నాటికి భూ భారతి రెవెన్యూ సదస్సుల క్రింద వచ్చిన దరఖాస్తుల పరిష్కారం

ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎస్

పయనించే సూర్యుడు జూన్ 24 (పొనకంటి ఉపేందర్ రావు )

ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి కే. రామ కృష్ణా రావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సి.ఎస్ కే.రామ కృష్ణా రావు ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆన్ లైన్ నుంచి అటవీ పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కోండా సురేఖ హాజరయ్యారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా జితేష్ వి.పాటిల్,అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మరియు ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ తో కలసి ఐ డి ఓ సి కార్యాలయం నుంచి పాల్గొన్నారు వన మహోత్సవం కార్యక్రమం, ఇందిరమ్మ ఇండ్ల, ఎరువుల లభ్యత, ఆయిల్ పామ్ పంట విస్తరణ, సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం వంటి పలు అంశాల పై సీఎస్ సుదీర్ఘంగా చర్చించి పలు సూచనలు చేశారు.ముఖ్య కార్యదర్శి కే. రామ కృష్ణా రావు మాట్లాడుతూ 2 లక్షల 30 వేల కు పైగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశామని, లక్షకు పైగా ఇండ్ల నిర్మాణ పనులు గ్రౌండ్ అయ్యాయని అన్నారు. పెద్ద వర్షాలు కురవడానికి ముందే మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్, బేస్మెంట్ స్థాయి వరకు నిర్మాణం జరిగేలా చూడాలని సీఎస్ సూచించారు.ఇందిరమ్మ ఇండ్ల కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ సీనరేజి చార్జిలను ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పెండింగ్ పనులు లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని అన్నారు. ప్రస్తుతం ఎంత మేరకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం జరిగిందో ఎంబీ రికార్డులను నమోదు చేసి లబ్ధిదారులకు ఇండ్లను కేటాయించాలని, ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తుందని అన్నారు.పిఎం ఆవాస్ యోజన అర్భన్ 2.0 క్రింద మనకు లక్షా 13 వేల ఇండ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ప్రతి పట్టణం నుంచి కనీసం 500 మంది నిరు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు.వన మహోత్సవం కార్యక్రమం క్రింద ఇండ్లకు పంపిణీ చేసే మొక్కల పెంపకం సైతం పరిశీలించాలని, మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎస్ కలెక్టర్ లకు సూచించారు. ప్రతి జిల్లా ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసుకుని వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించాలని, నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో-ఆర్డినేట్స్ తో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.ప్రతి జిల్లాలో ఎరువుల లభ్యత స్టాక్ పై రివ్యూ పెట్టాలని అన్నారు. జూలై వరకు అవసరమైన స్టాక్ ప్రస్తుతం అందుబాటులో ఉందని, సెప్టెంబర్ నాటికి అవసరమైన ఎరువుల స్టాక్ ప్రోక్యూర్ చేస్తున్నామని అన్నారు. ఎరువుల స్టాక్ ను ప్రత్యేక అధికారులను నియమించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.రిటైల్ విక్రయాలను డిజిటలైజ్ చేయాలని కలెక్టర్ లకు సీఎస్ సూచించారు. వ్యవసాయ సహకార సంఘాలు, ఎరువుల షాప్ వద్ద ఎక్కడ కొరత రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.లక్షా 25 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ పంట సాగు ప్రస్తుత సంవత్సరం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. రైతులకు లాభసాటి పంట ఆయిల్ పామ్ పట్ల అవగాహన కల్పిస్తూ పంట విస్తరణకు చర్యలు తీసుకోవాలని అన్నారు.భూ భారతి చట్టం రెవెన్యూ సదస్సుల ద్వారా దాదాపు 8 లక్షల 27 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటిని సాధా బైనామా, ఆర్ఓఆర్ సమస్యలు, పట్టాలో కరెక్షన్స్ వంటి వివిధ సమస్యల పై దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఆగస్టు 15 నాటికి ఈ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.డెంగ్యూ, మల్లేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు జిల్లాల్లో పటిష్ట చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ లు ప్రత్యేక శ్రద్ధ వహించి సీజనల్ వ్యాధుల నియంత్రణ పై అవగాహన కల్పన, పర్యవేక్షణ వంటి పలు కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు.టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వల్నరబుల్ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి లక్షణాలు గల ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి అవసరమైన చికిత్స అందించాలని అన్నారు.ఆన్ లైన్ నుంచి వీసి లో పాల్గోన్న అటవీ, పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మాట్లాడుతూ,l ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. జిల్లాలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గోన్నాలని అన్నారు.గతం కంటే మెరుగ్గా ప్రజల్లో వన మహోత్సవం కార్యక్రమం తీసుకుని వెళ్ళాలని, ప్రతి రోజూ ఒక్కో శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వసించాలని అన్నారు. జిల్లాలో వి.ఐ.పి పర్యటనల సందర్భంగా తప్పనిసరిగా మొక్కలు నాటేలా చూడాలని అన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ పరిధిలో ఎత్తైన మొక్కలు నాటి వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు.అటవీ ప్రాంతంలో కోతులకు అవసరమైన పండ్ల మొక్కలను పెద్ద ఎత్తున బ్లాక్ ప్లాంటేషన్ పెంచాలని అన్నారు. జిల్లాలకు కేటాయించిన వన మహోత్సవం లక్ష్యాలను కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించి పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ* 58345 దరఖాస్తులను భూ భారతి రెవెన్యూ సదస్సుల ద్వారా స్వీకరించామని,దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసి, దరఖాస్తులకు నోటీసులు జారీ చేసే ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఆగస్టు 15 నాటికి ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టామని అన్నారు.సీజనల్ వ్యాధుల నియంత్రణకు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు. పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని, ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. వన మహోత్సవం లో భాగంగా 70 లక్షల మొక్కలను నాటేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ వివరించారు. వనమహోత్సవం లో భాగంగా ప్రజలను భాగస్వామ్యం చేసేలా విస్తృత ప్రచారం కల్పిస్తున్నామన్నారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదరపు కలెక్టర్ విద్యాచందన, కొత్తగూడెం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, జిల్లా వైద్యాధికారి భాస్కర్ నాయక్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి కిషోర్,మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments