
డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ వెల్లడి
బూర్గులలో బండ్లబాట పునరుద్ధరణ కోసం దరఖాస్తు
( పయనించే సూర్యుడు జూన్ 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం మండల డిప్యూటీ తహసిల్దార్ ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సుకు రైతులు పలు సమస్యలు అధికారి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా గ్రామంలోని మామిడికుంట చెరువుకు సంబంధించిన 50 ఎకరాల చెరువుకి బాట లేకపోవడంతో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారనీ దీనితో గ్రామానికి సంబంధించిన ఆయకట్టు రైతులు గ్రామ పెద్దలు మాజీ ఎంపిటిసి పోచయ్య, కాశిరెడ్డిగూడ తొలి సర్పంచ్ దీనా శంకర్ యాదవ్, మాజీ సర్పంచ్ పరశురాం, మాజీ వార్డు సభ్యులు ఎల్లయ్య, వెంకటయ్య గౌడ్, పోలె శ్రీహరి రైతులు కలిసి డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్ సింగ్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్ సింగ్ మాట్లాడుతూ.. రైతులు మరియు ప్రజలకు ఉన్న రెవెన్యూ సమస్యల పట్ల అవగాహనతోని గ్రామాలకు మీ మధ్యకి వచ్చి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు మామిడికుంట చెరువుకు బాటకు సంబంధించి మీరు వినతిపత్రం ఇస్తే ఐ అవకాశాలను పరిశీలించి బాటను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. రైతుల సమస్యను తెలియజేయంగనే ఓపికతో విని సమస్య పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ ఎమ్మార్వోకు రైతులు గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు..
