Wednesday, June 18, 2025
Homeతెలంగాణప్రజా సంక్షేమమే లక్ష్యంగా భాజపా పాలన దేశానికే గర్వకారణం: చిలువేరు దుర్గయ్య

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా భాజపా పాలన దేశానికే గర్వకారణం: చిలువేరు దుర్గయ్య

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ చందూర్ జూన్ 18.* బంగారిగడ్డలో భాజపా మండల సంకల్ప సభ . ప్రజాసంక్షేమమే లక్ష్యంగా దేశ సేవే పరమావధిగా ప్రధాని నరేంద్ర మోదీ జీ పదకొండు సంవత్సరాల పాలన స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు ముదిగొండ ఆంజనేయులు అధ్యక్షతన బంగారిగడ్డ గ్రామంలో మండల సంకల్ప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జిల్లా కార్యదర్శి చిలువేరు దుర్గయ్య, అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అతిసామాన్య నిరుపేద కుటుంబంలో పుట్టిన మోదీజీ పేద ప్రజల ఆత్మ గౌరవం కాపాడేలా, వారి జీవితాలలో వెలుగులు నింపేలా అనేక సంస్కరణలు చేపట్టారని, ప్రధానంగా స్వచ్చభారత్ మరుగుదొడ్లు, వన్ నేషన్ వన్ రేషన్ ఉచిత బియ్యం, ఉజ్వల యోజన గ్యాస్ సిలిండర్లు, పంటలకు ప్రమాద భీమా, ప్రతి రైతు ఖాతాలో ఏడాదికి ఆరువేలు, ఆడపిల్లల భవిష్యత్తు కొరకు సుఖన్య సమృద్ధి యోజన, వృద్దులకు అటల్ పెన్షన్, అకస్మాత్తుగా మరణిస్తే కుటుంబానికి భరోసాగా 2లక్షల ప్రమాద భీమా, చిరు వ్యాపారులకు ముద్రాలోన్లు, జాతీయ రహదారులు, గ్రామీణ రోడ్లు ఇలా అనేక సంక్షేమ పథకాలతో పేదల పెన్నిధిగా మోదీ జీ నిలిచారని కొనియాడారు. అవినీతి, ఉగ్రవాద రహిత దేశంగా సైనికుల రక్షణ కోసం, దేశ భద్రత కోసం పాటుపడుతూ ప్రపంచానికే దిక్సూచి గా నిలిచిన గొప్ప సేవకునిగా మోదీ చరిత్రకెక్కారని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ కాసాల జనార్దన్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు నకిరేకంటి లింగస్వామి, సీనియర్ నాయకులు బొబ్బల మురళీ మనోహర్ రెడ్డి, యువ మోర్చా రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, జిల్లా నాయకులు అన్నేపర్తి యాదగిరి, మాదగోని నాగార్జున, మండల ప్రధాన కార్యదర్శులు పడసనబోయిన శ్రీను, ఆవుల అశోక్ యాదవ్, జిల్లా నాయకులు మాదగోని వెంకన్న, వరికుప్పల గిరి, మండల ఉపాధ్యక్షులు బరిగెల లింగస్వామి, నలపరాజు యాదగిరి, మండల కార్యదర్శులు దాసరి శంకర్, బోయపల్లి సాయి కుమార్, ఇరిగి శివ మండల నాయకులు కొండారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మల్గిరెడ్డి వెంకట్ రెడ్డి, నారపాక మహేందర్, పులిజాల రవీందర్, శ్రీపాల్ రెడ్డి,బండమీది వెంకన్న, ఉంగరాల దిలీప్, గంట రాము, యువ మోర్చా నాయకులు ఇడికూడా మోహన్, జక్కలి సందీప్, బూత్ అధ్యక్షులు నలపరాజు సత్తయ్య, నిమ్మల వెంకన్న, గుండెబోయిన దిలీప్, పాలకూరి దశరథ, కాటం ఆంజనేయులు,నాంపల్లి శేఖర్, మెరుగు అయోధ్య, చిలకరాజు రాజు, నాయకులు గోళ్ళూరి శేఖర్, దోటి పరమేష్, కట్ట నాగరాజు, సాగర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments