Monday, March 10, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు

ప్రణయ్ హత్య కేసులో నేడు తుది తీర్పు

Listen to this article

పయనించే సూర్యుడు మార్చి 10 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో సంచల నం రేపిన ప్రణయ్ పరువు హత్య కేసులో ఈ రోజు తుది తీర్పు వెలువడ నుంది. నల్గొండ జిల్లాలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నం దుకు ప్రణయ్ అనే దళిత యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు.
2018లో మిర్యాలగూడలో జరిగిన ఈ పరువు హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచల నంగా మారింది. ఈ కేసులో ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా ఎనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు.పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి, 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీటు దాఖలు చేశారు. ఛార్జిషీటు నివేదిక, పోస్టుమార్టం రిపో ర్టు, సాంకేతిక ఆధారాలతో పాటు సాక్షులను న్యాయ స్థానం విచారించింది. ఈ కేసులో తుది తీర్పును మార్చి 10కు న్యాయస్థానం రిజర్వు చేసింది. రెండవ అదనపు సెషన్స్, ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పుపై సర్వత్రా ఉ త్కంఠ నెలకొంది. ఐదున్నర ఏళ్ల పాటు విచారణ కొన సాగిన ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చి 7న హైదరా బాద్ ఆర్య వైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు. మిగతా నిందితులలో సుభాష్ శర్మ, అస్గర్ ఆలీ మినహా ఇతర ఐదుగురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు. అస్గర్ ఆలీ గతంలో గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల లోనూ కీలక నిందితుడిగా ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments