
పయనించే సూర్యుడు మార్చి 13 టేకులపల్లి రిపోర్టర్ (పొనకంటి ఉపేందర్ రావు)
టేకులపల్లి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు టేకులపల్లి మండలం నందు గల 36 గ్రామపంచాయతీ లలో గ్రామస్తులు, మరియు యూత్ ఆధ్వర్యంలో గురువారం ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి చొప్పున ఇంకుడు గుంట నిర్మాణాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సులానగర్, హై స్కూల్ మరియు తొమ్మిదో మైల్ తండా ప్రైమరీ స్కూల్ ఆవరణలో ఎంపీడీవో జి. రవీంద్రారావు ఆధ్వర్యంలో గ్రామస్తులు మరియు యూత్ ఇంకుడు గుంట నిర్మాణం చేపట్టడం జరిగింది. రాబోయే రోజులలో భూగర్భ జలాలు అడుగంటే అవకాశం ఉన్నందున ప్రతి ఇంటి ఆవరణలో ఒక ఇంకుడు గుంట నిర్మాణం ఉపాధి హామీ ద్వారా కచ్చితంగా నిర్మించుకోవాలని మరియు ప్రతి రైతు పొలంలో ఫారం పాడు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులను రైతులను కోరడం జరిగింది. వీటి వలన వృధాగా పోయే నీటిని పై నిర్మాణల ద్వారా భూగర్భ జలాలు పైకి తీసుకురావచ్చు అని అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో
ఏపివో కలంగి శ్రీనివాస్, కార్యదర్శి, ఎన్ పవిత్ర, కృష్ణకుమారి, క్షేత్ర సహాయకుడు భద్రం, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.