Wednesday, May 21, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రతి విద్యార్థి క్రీడలు ప్రతిభను తనలోని నైపుణ్యాలను పదిమంది గుర్తించుకునేలా ప్రయత్నించాలి

ప్రతి విద్యార్థి క్రీడలు ప్రతిభను తనలోని నైపుణ్యాలను పదిమంది గుర్తించుకునేలా ప్రయత్నించాలి

Listen to this article

ఐటీడీఏ పీవో బి రాహుల్

పయనించే సూర్యుడు మే 20 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతి విద్యార్థిని చదువుతోపాటు నచ్చిన క్రీడలతో పాటు కళల పట్ల కూడా మక్కువ చూపించి మీలోని ప్రతిభను నైపుణ్యాలను పదిమంది గుర్తుంచుకునే విధంగా ప్రయత్నం చేయాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. మంగళవారం నాడు ఐటీడీఏ ప్రాంగణంలోని కేజీబీవీలో ఈనెల 5వ తేదీ నుండి 15 రోజులు పాటు జరిగిన సమ్మర్ క్యాంపు ముగింపు సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థినీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మీ తల్లిదండ్రులు మా పిల్లలు బాగా చదివి ప్రయోజకులవుతారని అనే నమ్మకముతో ఉంటారని వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పనిసరిగా మీరందరూ బాగా చదివి వృద్ధిలోకి రావాలని, సమ్మర్ క్యాంపులు నిర్వహించేది విద్యార్థినిలలో వారిలో దాగివున్న ప్రతిభ మరియు నైపుణ్యాలను వెలికి తీసి వారిని ఉత్తములుగా తీర్చిదిద్దడానికి ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తారని దానిని విద్యార్థినిలు సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఇప్పటి నుండే భవిష్యత్తులో మీరు ఏమి కాదల్చుకున్నారో ఒక గోల్ అనేది ఏర్పాటు చేసుకోవాలని, అందుకు తగినట్లు కష్టమైన పనినైనా ఇష్టంగా ఎలా చేస్తామో అలాగే చదువులో కూడా ముందుండాలని అన్నారు. ఈ 15 రోజులు సమ్మర్ క్యాంపులో జిల్లాలోని కేజీబీవీ లో చదివే విద్యార్థినిలు మీరు చదివే సబ్జెక్టులతో పాటు యోగ, డాన్స్, వివిధ క్రీడలు మరియు కుట్లు, అల్లికలు, కంప్యూటర్ శిక్షణ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ శిక్షణలు తీసుకున్నందున తప్పనిసరిగా వాటిని అశ్రద్ధ చేయకుండా ప్రతిరోజు మీ ఇంటి వద్ద రిహర్షల్ చేస్తూ ఉండాలని అన్నారు. అనంతరం విద్యార్థినిలు ఈ 15 రోజుల శిక్షణలో నేర్చుకున్న అంశాలు మరియు వారి అనుభవాలను అధికారులకు ప్రదర్శన రూపంలో వివరించారు.ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర చారి, ఎంఈఓ రమ, కొత్తగూడెం జి సి డి వో అన్నామని విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments