Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య సేవలు మెరుగుపరచడానికి, పారిశుద్ధ్య కార్మికుల శ్రమను తగ్గించడానికి కలెక్టర్ చొరవతో మిషన్...

ప్రభుత్వ ఆసుపత్రులలో పారిశుద్ధ్య సేవలు మెరుగుపరచడానికి, పారిశుద్ధ్య కార్మికుల శ్రమను తగ్గించడానికి కలెక్టర్ చొరవతో మిషన్ శానిటేషన్ ప్రారంభం.

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 16 (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH)లో పరిశుభ్రత మరియు పారిశుధ్య పనులను మరింత సులభతరం చేయడానికి జిల్లా కలెక్టర్ వినూత్నమైన మెషిన్ శానిటేషన్ ఆలోచనను అందించారు. ఈ ఆలోచనను అమలు చేయడంలో భాగంగా, వెంటనే DMF నిధుల ద్వారా మంజూరు కల్పించి, అవసరమైన యంత్రాలను పొందేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా క్రింది యంత్రాలను హాస్పిటల్‌కు అందించారు:స్క్రబ్బింగ్ మెషిన్ మాన్యువల్ స్వీపర్ హై ప్రెషర్ వాషర్ ఈ యంత్రాలు ఇటీవల హాస్పిటల్‌కు డెలివరీ అయ్యి, వినియోగానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఇవి ప్రత్యక్షంగా వినియోగంలోకి వచ్చాయి. దీంతో ఆసుపత్రిలో పారిశుధ్య ప్రమాణాలు మరింత మెరుగవుతాయి, కార్మికుల శ్రమ తగ్గుతుంది, మరియు రోగులకు శుభ్రమైన వాతావరణం అందుతుంది.ఈ సందర్భంలో, GGH కొత్తగూడెం తరఫున సూపరింటెండెంట్ కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఆయన చూపిన చొరవ ప్రశంసనీయం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments