
ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్
జిల్లెడ్ చౌదరిగూడ మండల విద్యా అధికారి కిరణ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందిస్తున్న ఏఐఎస్ఎఫ్ నాయకులు
( పయనించే సూర్యుడు జూన్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ సూచించారు. మంగళవారం జిల్లేడ్ చౌదరిగుడా మండల విద్యాధికారి కార్యాలయంలో మండల విద్యాధికారి కిరణ్ కుమార్ రెడ్డికి కలిసి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వినతి పత్రం అందజేశారు. ఈనెల 12 నుంచి పాఠశాలలు పున ప్రారంభం కావడం జరిగింది. పాఠశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు సకాలంలో పాఠ్యపుస్తకాలు అందించడంతోపాటు మధ్యాహ్న భోజనం యూనిఫామ్ మూత్రశాలలు మరుగుదొడ్లు, ఉపాధ్యాయుల కొరత బోధనేతర సిబ్బందిని నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాహుల్, ఆకాష్ చౌహన్, శ్రీను, నరేష్, తదితరులు పాల్గొన్నారు