Saturday, June 7, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచండి - షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచండి – షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Listen to this article

రావిర్యాల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి బడిబాట కార్యక్రమం అమలు గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

( పయనించే సూర్యుడు జూన్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

షాద్ నగర్ నియోజక వర్గంలోనీ జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని రావిర్యాల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలను సందర్శించి బడిబాట కార్యక్రమం అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడంతో పాటు మన ఊర్లో ఉన్న బడిని మనమే కాపాడుకోవాలని వీర్లపల్లి శంకర్ నాయకులకు,అధ్యాపకులకు సూచించారు. ఈ విద్య సంవత్సరానికి సరఫరా చేసిన ఉచిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు.గతంలో విద్యా వ్యవస్థను నిర్లక్షం చేశారని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ బడుల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాములు,అధ్యాపకులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments