
పయనించే సూర్యుడు న్యూస్(10/06/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
గత ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తీవ్రంగాగాయపడిన వరదయ్యపాలెం పంచాయతీ చెన్నవారీపాలెం ఎస్సీ కాలనీకి చెందిన మాజీ వార్డు సభ్యులు చెంగయ్య కుమారుడు (సూరి సోదరుడు) దగ్గోలు సాయి నీ మంగళవారం రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి బొప్పన తిలక్ బాబుపరామర్శించారు.
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సాయి ఆరోగ్య పరిస్థితిని వైద్య సేవల గురించి ఆరా తీశారు. కుడి చేయికి శస్త్రచికిత్స చేయగా కుడికాలుకు బుధవారం శస్త్ర చికిత్స చేయాల్సిఉందని కుటుంబ సభ్యులు తెలిపారు స్థానికులు ఈనాడుపాత్రికేయులు కిన్నెర ఉమా మహేష్, పీవీ రమేశ్, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్య ప్రకాశ్ చౌదరి, తదితరులు పాల్గొన్నారు