
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మేర యువభారత్ సభ్యులు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి సర్కిల్ ఇన్ స్పెక్టర్ సుబ్బారావు హాజరై గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ యువత క్రీడలతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలని అన్నారు. యువతను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న మేరా యువభారత్ సభ్యులను అభినందిస్తున్నాం అన్నారు. అలాగే కుమార్ యాదవ్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా బంగారు భవిష్యత్తును నిర్మించుకొనుటకు క్రీడా మైదానాలలో, గ్రంథాలయాలలో, విద్యాలయాలలో ఎక్కువ సమయం గడపాలి అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి అన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చందన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో అమ్మాయిలు కూడా క్రీడలపై మక్కువ పెంచుకొని క్రీడారంగంలో రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, యువజన సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
