
పయనించే సూర్యుడు గాంధారి 23/04/25
మండల కేంద్రంలోని భవిత ప్రత్యేక పాఠశాల కేంద్రంలో మండల విద్యాధికారి శ్రీహరి ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలు గల నరాల బలహీనతతో బాధపడుతున్న ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఫిజియోథెరపీ క్యాంపను నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులను వ్యాయామ పరీక్ష చేస్తూ డాక్టర్ సారిక తల్లిదండ్రులకు తగు సూచనలు ఇచ్చారు. ఈ వ్యాయామ పరీక్షను ప్రతిరోజు ఉదయం సాయంత్రం పిల్లలకు తల్లిదండ్రులు చేయించడం ద్వారా నరాల బలహీనత నుండి కోలుకొనే అవకాశాలు చాలా ఉన్నాయని ఆమె తెలిపారు. తదనంతరం గత నెల సర్వ శిక్ష అభియాన్ మరియు అలింకో ఆధ్వర్యంలో జరిగిన నిర్ధారణ శిబిరానికి వచ్చిన దివ్యాంగులకు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కిట్లను మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి అందజేశారు. ఈ సామాగ్రిని పిల్లలు వినియోగించి తమ తమ సామర్థ్యాలను పెంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉపాధ్యాయులు శ్రీనివాస్, పెంటయ్య రిసోర్స్ పర్సన్ సాయన్న తదితరులు పాల్గొన్నారు.