Thursday, August 14, 2025
Homeఆంధ్రప్రదేశ్బంజారా భవన్ భూమిని సర్వే చేసి హద్దుబందులు కేటాయించండి.

బంజారా భవన్ భూమిని సర్వే చేసి హద్దుబందులు కేటాయించండి.

Listen to this article

ఆర్డిఓ ఆఫీస్ సూపరిండెంట్ జ్యోతి గారికి గిరిజన సంఘాల నాయకులు వినతిపత్రం అందజేత.

( పయనించే సూర్యుడు ఆగస్టు 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

ప్రభుత్వం కేటాయించిన “బంజార భవన్” భూమిని ఆక్రమణ నుండి కాపాడి హద్దు బందులు చూపించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన సంఘం లంబడాకుల పోరాట సమితి షాద్నగర్ ఆర్డిఓ సూపర్ఇండెంట్ జ్యోతి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసి కాంగ్రెస్ జిల్లా చైర్మన్ శీను నాయక్ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈశ్వర్ నాయక్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు శ్రీను నాయక్ తదితరులు మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గంలోనీ ఫరూక్నగర్ మండల పరిధిలోని గుండ్లకుంట గ్రామ రెవెన్యూ శివారులో సర్వేనెంబర్ 12/P ఒక ఎకరా ప్రభుత్వ భూమిని తేదీ 03-8- 2023 జీవో నెంబర్ NIT NO SE/TW/176/2023-24 ద్వారా బంజారా భవన్ నిర్మాణం కోసం ప్రభుత్వ భూమిని కేటాయించడంతోపాటు నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలు అంచనా వేసి కేటాయించడం జరిగిందని అట్టి భూమిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా కబ్జా చేయడం జరిగిందని కావున బంజారా భవన్ భూమిని కబ్జా నుంచి కాపాడి బంజారా భవన్ నిర్మాణం కోసం హద్దు బందులు చూపించాలని గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కోరుతున్నామని వారు అన్నారు లేని పక్షంలో గిరిజనులందుని ఏకం చేసి కబ్జా నుంచి తిరిగి తీసుకునే విధంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments