
పయనించే సూర్యుడు // న్యూస్ మే 26// నారాయణపేట జిల్లా బ్యూరో// బి విశ్వనాథ్
నారాయణపేట జిల్లా ముడుమాల్ గ్రామం లో నేడు ప్రాథమిక పాఠశాల యందు ప్రధానోపాధ్యాయులు శ్రీ దండు శేఖర్ గారి అధ్యక్షతన గ్రామంలో గల నాలుగు అంగన్వాడీ సెంటర్ల టీచర్లతో సమావేశం అయి జూన్ 1నుండి ప్రారంభం అయ్యే బడి బాట కార్యక్రమము విధి విధానాలు మరియు సెంటర్ వారిగా విద్యార్థుల నమోదు, ఇంటింటి సందర్శన తదితర విషయాలు కూలంకషంగా చర్చించి, అంగన్వాడీ టీచర్ల సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంగన్వాడి టీచర్లుతో మాట్లాడుతూ ఈసారి బడిబాట కార్యక్రమము రోజు వారి షెడ్యూల్ ప్రకారం చేద్దామని, అడ్మిషన్ల కొరకు ప్రతి ఇంటికి వెళదామని, అందరు సమిష్టిగా కృషి చేసి బడి బాట కార్యక్రమమును విజయవంతం చేయాలని పేర్కొనడం జరిగింది