
పయనించే సూర్యుడు జూన్ 13( ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బసవరాజుపాలెం గ్రామంలో గత ఐదు రోజులుగా దళితులకు బీసీ యాదవ కులస్తులకు మధ్య వివాదం నెలకొనడంతో ఆ గ్రామాన్ని ఈరోజు కుల వివక్షత పోరాటా సమితి జిల్లా మరియు స్థానిక నేతలు సందర్శించారు.. గ్రామాన్ని సందర్శించిన అనంతరం ఆత్మకూరులోని సిపిఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు..వారు మాట్లాడుతూ ఇటీవల ఈ గ్రామానికి చెందిన పేర్నపాటి. విజయ్ అనే దళిత యువకుడిని అదే గ్రామంలోని యాదవ కులానికి చెందిన గుండు బోయిన.నర్సింహులు అనే వ్యక్తి కులం పేరిట దూషించిన ఘటనపై కేసు నమోదు కావడంతో గత నాలుగు రోజులుగా గ్రామంలో యాదవ కులస్తులకు మరియు దళితులకు మధ్య వివాదం నెలకొంది.. బీసీ యాదవ మరియు కొందరు అగ్రకులస్తులు తమను సంఘ బహిష్కరణ చేస్తూ పలు నిర్ణయాలు తీసుకున్నారని దళితులు ఆర్డీవోకు స్థానిక డిఎస్పీకి ఫిర్యాదు చేశారు.. అదేవిధంగా ఇదే విషయమై గ్రామానికి చెందిన యాదవ కులస్తులు కూడా డిఎస్పిని కలిసి ఫిర్యాదు చేశారు..ఈ విషయమై సమగ్ర విచారణ చేస్తానని డిఎస్పీ ఇరు వర్గాలకు నచ్చ చెప్పారు. కానీ కేసు నమోదు చేసిన ఇప్పటివరకు దీనిపై విచారణ చేపట్టలేదని దీనిపై సమగ్ర విచారణ చేపట్టి దళితులకు రక్షణ కల్పించవలసిన బాధ్యత అధికారులకు ఉందని వీరు విలేకరుల సమావేశంలో తెలిపారు.. ఇప్పటివరకు ఒక్క అధికారికి కూడా ఈ గ్రామాన్ని సందర్శించి అసలు ఏం జరిగిందో కూడా విచారణ చెప్పకపోవడం బాధాకరమైన వీరు తెలిపారు..ఈ కార్యక్రమంలో జిల్లా కులవ్యక్షత పోరాట సమితి అధ్యక్షులు నేలపాటి రఘురామయ్య, జిల్లా కార్యదర్శి ఆలూరు తిరుపాలు, జిల్లా ఉపాధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, జిల్లా కౌరు రైతుల సంఘం నాయకులు లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.