Friday, June 20, 2025
Homeఆంధ్రప్రదేశ్బహిరంగ సభ స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

బహిరంగ సభ స్థలాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 20 (పొనకంటి ఉపేందర్ రావు )

ఇల్లందు :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సింగరేణి స్కూల్ గ్రౌండ్ నందు శనివారం నిర్వహించనున్న భారీ బహిరంగ సభ స్థలాన్ని ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పరిశీలించారు. రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భారీ బహిరంగ సభకు హాజరుకానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లపై చర్చించారు. సభ ఏర్పాట్లలో ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా, సభకు వచ్చే ప్రజలకు ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా చూడాలని అధికారులకు, పార్టీ నేతలకు సూచించారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని ప్రజలు భారీగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు డి.ఎస్.పి చంద్రబాను ఇల్లందు సీఐ బత్తుల సత్యనారాయణ , మరియు నియోజకవర్గ నాయకులు మడుగు సాంబమూర్తి, బోళ్ళ సూర్యం, డి శివకుమార్, చిల్లా శ్రీనివాస్, ఎర్రసంగి ఎంకన్న, సైదా మియా, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments