
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సన్మానించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
( పయనించే సూర్యుడు జూన్ 16 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
తెలంగాణ ప్రభుత్వంలో పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నియమితులైన వాకిటి శ్రీహరి బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం డా.బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం చేరుకున్న మంత్రి వాకిటి శ్రీహరిని వేదమంత్రోచ్చారణలతో పండితులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తనకు కేటాయించిన చాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి బాధ్యలు స్వీకరించారు. ఈ సందర్భంగా షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి శ్రీహరి ని సన్మానించారు.
