Wednesday, June 25, 2025
Homeఆంధ్రప్రదేశ్బిజెపి ఆరోపణలకు పత్రిక సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత...

బిజెపి ఆరోపణలకు పత్రిక సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో

బుధవారం రోజున భీంగల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. నిన్న ఏదైతే కొంతమంది బిజెపి నాయకులు మున్సిపల్ లో 20-02-2022 నుండి 21-02-2025 వరకు అవినీతి జరిగిందని ఆరోపిస్తూ మాట్లాడిన మాటలకు మాజీ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ పత్రిక సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వడం జరిగింది 1. బ్లీచింగ్ పౌడర్ కు 19 లక్షలు ఖర్చు చేసిన దాంట్లో అంతకుముందు జరిగిన రెండు సంవత్సరాల పరిపాలనలో ఉన్న పెండింగ్ బాకీ ని 7 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది మిగతా 12 లక్షలు సంవత్సరానికి 4 లక్షల చొప్పున 3 సంవత్సరాలకు బీచ్ పౌడర్ కు ఖర్చు చేయడం జరిగింది 2. డ్రిల్లింగ్ బోర్లు 34 లక్షలు ఖర్చు చేసిండ్రు అని ఆరోపణ చేస్తున్నారు ప్రతి కౌన్సిలర్ కు కో ఆప్షన్ నెంబర్లకు అన్ని కలిపి 28 లక్షలు ప్రోసిడింగ్లు ఇవ్వడం జరిగింది మిగతా 6 లక్షల రూపాయలు 1చొక్కాయ గుట్టకు బోరు మోటర్ 2అయ్యప్పగుట్టకు బోరు మోటర్ 3బ్రహ్మంగారి గుట్ట సంతోష్ నగర్ తండ దగ్గర బోరు మోటర్ 4 కొత్త యూత్ రూమ్ దగ్గర బోరు మోటర్ 3. జెసిబి ట్రాక్టర్లు ఆటోలో రిపేరు 11 లక్షలు ఖర్చు చేశారని ఆరోపణ చేశారు దాంట్లో నుండి పాతవి 1,50,000 రూపాయలు చెల్లించడం జరిగింది మిగతా 3 సంవత్సరాల జెసిబి రిపేరుకు కి 4 లక్షల ఖర్చు మిగతాది ఆటోలు ఆటోలు పల్టీవడి పెద్ద మొత్తంలో డ్యామేజ్ అయితే 1, ఆటోకు 80000 రూపాయలు 2 ఆటోకు 1.00000 రూపాయలు రెండు ఆటోల రిపేర్ ఖర్చు అవడం జరిగింది మరియు మూడు సంవత్సరాల ఆయిల్ చేంజ్ టైరు రకరకాల రిపేర్లు ఖర్చులు మరియు టక్టర్ రిపేరు ఆయిల్ చేంజ్ టైర్లు ఇలా అనేక రకాల ఖర్చులు ఈ 9 లక్షల 50 వేల రూపాయలు మూడు సంవత్సరాలు జెసిబి ట్రాక్టర్ ఆటోలకు రిపేర్ ఖర్చు చేయడం జరిగింది 4, చెట్ల ఖర్చు 15 లక్షల రూపాయలు ఖర్చు జరిగింది అని ఆరోపించడం జరిగింది దానికి వివరంగా పాతవి మూడు లక్షల రూపాయలు మిగతా ఒక్కొక్క కౌన్సిలర్ కి లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది జరిగింది 5. మొరం ఖర్చు 16 లక్షలు ఖర్చు చేశారు అని ఆరోపించారు దానికి వివరణగా పాత బిల్లు 3 లక్షల రూపాయలు చెల్లించడం జరిగింది మిగతా 13 లక్షలు ప్రతి సంవత్సరానికి దసరా బతుకమ్మ గణేష్ ఉత్సవాలకు ముందుగా ఎక్కడైతే రోడ్లు చెడిపోయి మరియు రామన కుంట చెరువు కట్ట పైన మొరం వేయడం జరిగింది ఒక్కొక్క సంవత్సరానికి రెండు లక్షల చొప్పున మూడు సంవత్సరాలకు 6 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. మిగతా 7 లక్షల రూపాయలు 1వార్డులొ 1.శర్మ నాయక్ ఇంటి నుంచి ఆర్ అండ్ బి రోడ్ వరకు నూతన మొరం రోడ్డు వేయడం జరిగింది 2.రాజు నాయక్ ఇంటి నుండి మెండోరా మోహన్ ఇంటి వరకు మొరం రోడ్డు వేయడం జరిగింది 3.శివాలయం రోడ్డు మొరం వేయడం జరిగింది 4. చదరక్ పాస్టర్ ఇంటి నుండి నర్సరీ వరకు మొరం వేయడం జరిగింది బాపూజీ నగర్ కాలనీలో రెండుసార్లు మొరం వేయడం జరిగింది మొత్తం 1కోటి 93 లక్షల ఖర్చు జరిగిందని అని బిజెపి నాయకులు ఆరోపణ చేస్తున్నారు దానిలో నుండి పాత బకాయిలు రెండు సంవత్సరాలు 65 నుంచి 70 లక్షల ఖర్చు చెల్లించడం జరిగింది మిగతా 3 సంవత్సరాల 1 కోటి చిల్లర ఖర్చు చేయడం జరిగింది ఈ ఖర్చులు మొత్తం మునిసిపల్ పాలకవర్గం తీర్మానం ప్రకారం ఖర్చు చేయడం జరిగింది దీనిపై ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వయిరీ జరిగింది మాపై అనవసరమైన ఆరోపణలు చేసి బురదజల్లే ప్రయత్నం చేయొద్దు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో ఉన్నయ్ అనవసరంగా బిజెపి నాయకులు ఆరోపణలు చేసి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నం మానుకోవాలి మరి మున్సిపల్ ఐదు సంవత్సరాల పాలనలో మూడు సంవత్సరాల పాలన పైనే ఆరు కోణాలు చేస్తున్నారు అంతకు ముందు జరిగిన రెండు సంవత్సరాల పాలనలో జరిగిన ఖర్చులు అభివృద్ధిలో పైన కూడా వివరణ బిజెపి మిత్రులు ఇస్తే పాత బిల్లులు ఎన్ని పెండింగ్ బిల్లులు చెల్లించాము తెలుస్తుండే

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments