
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
బీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలనీ, బీసీ జర్నలిస్ట్ అసోసియేషన్ జేఏసీ సభ్యులు తొట్ల పరమేష్, కొహీర్ నాగరాజు, తేళ్ల హరికృష్ణ, దాదే వెంకట్ అన్నారు. తెలంగాణ లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ల కోసం విడుదల చేసిన జీవోకు చట్టబద్ధత కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే నిర్వహించాలని కోరుతూ, శనివారం చేపట్టిన బీసీ బంద్ కార్యక్రమంలో భాగంగా, కేపీహెచ్ బీ రోడ్ నెంబర్ వన్, గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో, జీవో నెంబరు 9 ను విడుదల చేసి ఎన్నికలకు సిద్దం కాగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చట్టబద్ధత కల్పించకుండా తాత్సారం చేస్తుందని విమర్శించారు. “తెలంగాణలో బీసీ వర్గాల సంక్షేమం కోసం జర్నలిస్టులు ఫ్రంట్ లైన్లో పనిచేసి సాధించిన విజయాలు గుర్తించాలన్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సాధనానికి కూడా ఇదే కృషి కొనసాగిస్తామని తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు నామాల శ్రీధర్, శ్రీకాంత్, గాదె లక్ష్మణ్ గౌడ్, కిషోర్ భాస్కర్ చారి, నరసింహ, శంకర్, గోపీకురుమ, చంద్రశేఖర్, రాము, హరి, వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
