
( పయనించే సూర్యుడు జూన్ 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ పట్టణంలోని రామకృష్ణ థియేటర్లో జరిగిన కరాటే గ్రేడింగ్ టేస్టులో దాదాపు 100 విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణానికి చెందిన యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ కలర్ బెల్ట్ గ్రేడింగ్ టేస్టులో విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచి వివిధ బెల్టులను స్వాధీనం చేసుకున్నారు. కటాఫ్ మరియు కుమ్మిటి మరియు కిక్స్, పంచెస్, బ్లాక్స్ మొదలైన అంశాలు పరిగణలో తీసుకొని వారి యొక్క ఉత్తీర్ణతను నిర్ధారించడం జరిగింది. అనంతరం మాస్టర్ సాయినాథ్ మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు కరాటే నేర్చుకోవాలని ప్రత్యేకంగా ప్రతి అమ్మాయిలకు కరాటే ఎంతో అవసరం అని అన్నారు. కరాటే నేర్చుకోవడం ద్వారా మానసికంగా మరియు శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటారని తద్వారా తమ పనులను కూడా ఆత్మవిశ్వాసంతో చేస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ మాస్టర్ సాయి ప్రియ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు.
