
( పయనించే సూర్యుడు ఆగస్టు 05 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
దళితుల ఇండ్లకు అడ్డంగా వేసిన కంచను తొలగించిన దళిత సంఘలు సామాజిక సంఘాల నాయకులు రాజకీయ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కెవిపిఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బోడ సామేలు మాట్లాడుతూ… హైదరాబాదు పూత పెట్టు దూరంలో ఉన్న బూర్గుల గ్రామానికి చెందిన దళితులు ఇల్లు నిర్మించుకొని సంవత్సరాల పాటు అక్కడే జీవిస్తున్న వారు పోకుండా అదే గ్రామానికి చెందిన బూర్గుల నర్సింగ్ రావు కుటుంబీకులు అడ్డంగా కంచె వేయడం నోటికి వచ్చినట్లు బూతులు తిడుతూ కులం పేరుతో దూషించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోని దళితులకు అండగా పోలీస్ యంత్రాంగం రెవిన్యూ రంగం ఉండాలని కోరారు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎంపీటీసీ బూరుగుల సుమన దళితులకు అడ్డంగా వేసిన కంచెను తొలగిస్తున్నానని వచ్చి అందరి ముందు తొలగించడం జరిగింది. మానవత దృక్పథంతో బూర్గుల సుమన చెప్పడం చాలా సంతోషకరం అన్నారు. దళిత బస్తికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో ఉద్యానవనం పార్కు నిర్మిస్తామని చెప్పారు నాయకులు కేవిపిఎస్ నాయకులు ఉద్యానవనం సంబంధించిన చెట్లను ఫారెస్ట్ డిఆర్డిఏ అధికారులతో మాట్లాడి పంపిస్తామన్నారు. ఆ గ్రామానికి చెందిన ప్రజలందరూ సంతోషించారు. రంగారెడ్డి జిల్లాలో ఎక్కడైనా రోడ్ల సమస్య డొంకల సమస్య ఉన్నట్లయితే బూర్గుల సుమనా లాగా సహోదయంతో సమస్యలను పరిష్కరించుకోవాలని కెవిపిఎస్ గా కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దుబ్బ చెన్నయ్య ఎం అశోక్ సిఐటియు నాయకులు రాజు శ్రీను దళిత సంఘాల నాయకులు ఎస్ఎఫ్ఐ శ్రీకాంత్ టిడిపి మండల అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ సరూర్నగర్ మండల వైస్ ఎంపీపీ మౌనిక హరి కృష్ణ గౌడ్ గ్రామస్తులు రామకృష్ణ శివకుమార్ నరసింహులు సురేషు సాయి శంకర్. శ్రీహరి శివ అనిలు ఆకాష్. వెంకటేష్ తదితరులు పాల్గొని ఆ గ్రామానికి చెందిన దళితులకి భరోసాని ఇచ్చారు
