
బోనాలు ఎత్తుకున్న మహిళలు…
రుద్రూర్, మే 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బారెడు పోచమ్మ పండగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా బారెడు పోచమ్మ ఆలయానికి వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వీడిసి చైర్మన్ పట్ల సురేష్, పూజారి వడ్ల గంగారాం, కుర్మాజి గంగారాం, మాజీ జడ్పిటీసి నారోజీ గంగారాం, కుర్మాజీ సాయిలు, పాపయ్య, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.