
ముఖ్యఅతిథిగా పాల్గొన్న గిరిజన ఉద్యోగులసంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు హథిరామ్ నాయక్
పయనించేసూర్యుడు మే 29 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి కి బోనాలు అన్ని వర్గాల ప్రజలు ఘనంగా సమర్పించారు అతిథిగా పాల్గొన్న గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి హాథిరామ్ నాయక్ గ్రామ కమిటీ సభ్యులు బానోత్ సాములు నాయక్ బుర్ర ధర్మయ్యా గౌడ్ బొమ్మెర వరప్రసాద్ గౌడ్ నల్లమసు రాజన్న రత్నా నాయక్ మేళతాళాలతో అంగరంగా వైభవంగా డీజే నృత్యాలతో మహిళలు అమ్మవారికి ఇష్టమైన పాయసం గుగ్గిలు ఇష్టమైన ఆహార పదార్థాలు బోనం తీసుకొని సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మహిళలూ యువతి యువకులు వర్గాలవారిగా వెళ్ళి బోనాలు సమర్పించడం జరిగినది తరువాత అమ్మ వారికి యాటలు కోళ్లు సమర్పించడం జరిగినది పంటలు బాగా పండాలని ఊరి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మ వారి ఆశీస్సులు గ్రామ ప్రజల పై ఉండాలని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఊరి ఆడ బిడ్డలు అందరూ రావడంతో ఉరికి కొత్త కళ వచ్చినది అందరూ ఆనంద ఉత్సవాలతో బోనాలు కార్యక్రమంను విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో రమేష్ బాబు నాయకులు నల్లమాడు శంకర్ హేమచంద్ర నాయక్ హరికిషన్ బాలాజీ రవి కుమార్ ప్రభాకర్ రమేష్ పార్వతీ జ్యోతి పద్మ తదితరులు పాల్గొన్నారు