Tuesday, July 1, 2025
Homeతెలంగాణబోధన్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

బోధన్ లో ఘనంగా జగన్నాథ రథయాత్ర

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 30 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర ఊరేగింపు మహోత్సవం సోమవారం అత్యంత భక్తి శ్రద్దలతో, ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, శ్రీమాన్ వైష్ణావాంగ్రీ సేవక్ దాస్ లు విచ్చేసి బలభద్ర, సుభద్ర, జగన్నాథ ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్ర ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఇస్కాన్ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు భక్తి మార్గంలో నడవాలని సూచించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి పట్టణంలో నాలుగు ఎకరాల స్థలం కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా పట్టణంలోని ఆచన్ పల్లి నుండి ప్రారంభించిన రథయాత్ర శక్కర్ నగర్ చౌరస్తా నుండి కొత్త బస్ స్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాత బస్ స్టాండ్, శివాలయం కమాన్ వరకు చేరుకుని తిరిగి అంబేద్కర్ చౌరస్తా మీదుగా టీటీడీ కల్యాణ మండపం వరకు కొనసాగింది. అనంతరం టీటీడీ కల్యాణ మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి మహా ప్రసాద కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ శ్రీనివాస్, సీఐ లు వెంకటనారాయణ, విజయ్ బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాశంకర్, శరత్ రెడ్డి, దాము, నరేందర్ రెడ్డి, ఇస్కాన్ ప్రతినిధులు అశోక్ ఆత్మ సీతారాయి దాస్, రత్నమై రాధిక దేవిదాస్, కేశవ కరుణానిది దాస్, యాదవ్ పతి గోవింద్ దాస్, నర్సింలు ప్రభుజీ, తిమ్మన్న ప్రభుజీ, శివరాం ప్రభుజీ, గంగాస్వామి ప్రభుజీ, పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments