Thursday, June 12, 2025
Homeతెలంగాణబోధన్ లో జర్నలిస్టులు ప్రజాసంఘాల నల్ల బ్యాడ్జితో నిరసన

బోధన్ లో జర్నలిస్టులు ప్రజాసంఘాల నల్ల బ్యాడ్జితో నిరసన

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ మే 10 నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో మంగళవారం బోధన్ జర్నలిస్టులు మరియు ప్రజాసంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు సాక్షి ఆఫీస్ ల పై దాడి,సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినే శ్రీనివాసరావు అక్రమ అరెస్ట్ ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛ పై దాడిగానే పరిగణిస్తామని జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులుఅన్నారు.ఏపీ రాష్ట్రంలోసాక్షి మీడియా ఆఫీస్ లు,జర్నలిస్టుల దాడి అక్రమ అరెస్టులను ఖండిస్తూ మంగళవారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు, ప్రజాసంఘాల నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షుడు పుట్ట వరద య్య,టియు సిఐ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్,పిడిఎస్ యూ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ కుమార్,వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి ఏశాల గంగాధర్ మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పాలన వైఫల్యాలు,ప్రజలకు ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తున్న సాక్షి పత్రిక ,జర్నలిస్టుల పై అక్రమ కేసులు పెట్టడం,జర్నలిస్టులను అరెస్ట్ చేయడం రాజకీయ కక్ష సాధింపు చర్యని పేర్కొన్నారు.పత్రిక స్వేచ్ఛను,రాజ్యాంగ బద్ధ హక్కులను ఉల్లంగించడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చెల్లదని తెలిపారు.సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని,బేషరతుగా ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టులు బండారి సాయిలు,ఉమాకాంత్, రమేష్,జగన్ ,కడికే శివ,అంజి,మల్లికార్జున్,మోహన్,రాహుల్, తహెర్,ఐఎఫ్ టియు జిల్లా కార్యదర్శి దాల్ మల్క పోశెట్టి,అఖిల భారత ఐక్య రైతు సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి సుల్తాన్ సాయిలు,సాక్షి బోధన్ ఆర్ సి ఇంచార్జీ గడ్డం గంగులు,సాక్షి టీవీ న్యూస్ చానల్ రిపోర్టర్ తోకల రవి,రిపోర్టర్ నల్వాల క్రిష్ణ, ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments